తొలి రోజే ఏడుపులు… పెడబొబ్బలు

బిగ్ బాస్ తొలిరోజు ఎపిసోడ్ కొంచెం ఆసక్తికరంగానే సాగింది. తొలిరోజే నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కావడంతో పార్టిసిపెంట్స్ మధ్య విభేదాలు తలెత్తాయి. మొత్తం 19 మంది కంటెస్టెంట్లు [more]

Update: 2021-09-07 02:50 GMT

బిగ్ బాస్ తొలిరోజు ఎపిసోడ్ కొంచెం ఆసక్తికరంగానే సాగింది. తొలిరోజే నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కావడంతో పార్టిసిపెంట్స్ మధ్య విభేదాలు తలెత్తాయి. మొత్తం 19 మంది కంటెస్టెంట్లు ఉన్న బిగ్ బాస్ లో తొలిరోజు నామినేషన్ ప్రక్రియ ఆసక్తికరంగా సాగింది. తాము నామినేషన్ చేయదలచుకున్న వారి చెత్త బుట్టను డబ్బాలో వేయాలని బిగ్ బాస్ సూచించారు. ఈ ప్రక్రియ లో జస్వంత్ ని ఎక్కువ మంది నామినేట్ చేశారు. జస్వంత్ తనను నామినేట్ చేస్తుండటం, నీ అమాయకత్వానికి ఇక్కడ పనికి రావని నటరాజ్ మాస్టార్ చెప్పడంతో జస్వంత్ కన్నీటి పర్యంతమయ్యారు. ఇక హమిదా తనను నామినేట్ చేస్తున్నప్పుడల్లా కన్నీరు పెడుతుంది. ఆర్ జే కాజల్ సయితం తనను ఎక్కువ మంది నామినేట్ చేయడంతో ఉద్వేగానికి లోనయింది. జెస్సీకి, విశ్వకి తొలిరోజే వాగ్వాదం జరిగింది. మొత్తం మీద తొలిరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ ఏడుపులు, పెడబొబ్బలతోనే సాగిందని చెప్పాలి. ఫస్ట్ వీక్ నామినేషన్ ముగిసింది. ఈ నామినేషన్ సరయు, జస్వంత్, రవి, హమిద, మానస్, కాజల్ ఉన్నారు. వీరిలో ఒకరు వచ్చే వారం ఇంటికి వెళ్లాల్సిందే.

Tags:    

Similar News