మాజీ లవర్స్ మళ్ళీ కలవడం లేదా?

కోలీవుడ్ లో కొనేళ్ల క్రితం నయనతార – ప్రభుదేవా ల లవ్వాయణం మాములుగా లేదు. ఇద్దరు కలిసి సినిమాలు చెయ్యడం, షికార్లకి తిరగడం, అంతెందుకు నయనతార కోసం [more]

Update: 2020-06-05 05:09 GMT

కోలీవుడ్ లో కొనేళ్ల క్రితం నయనతార – ప్రభుదేవా ల లవ్వాయణం మాములుగా లేదు. ఇద్దరు కలిసి సినిమాలు చెయ్యడం, షికార్లకి తిరగడం, అంతెందుకు నయనతార కోసం ప్రభుదేవా అయితే ఏకంగా తన భార్య రామలతకి విడాకులు కూడా ఇచ్చాడు. ఇప్పుడు నయనతార – ప్రభుదేవాలకి లవ్ బ్రేకప్ అయినప్పటికీ…. ప్రభుదేవా మాజీ భార్య నయనతారని దుమ్మెత్తిపోస్తూనే ఉంది. అయితే ప్రభుదేవా నయనతార కోసం పిచ్చెక్కి తిరిగిన ఎందుకో పెళ్లి దగ్గరపడగానే బ్రేకప్ చెప్పేసుకుని ప్రభుదేవా బాలీవుడ్ లోను, నయనతార కోలీవుడ్ టాలీవుడ్ లోను బిజీగా మారారు. అయితే నయనతార ఈమధ్యన నమ్మకం లేకనే ప్రేమను వదులుకున్నా అంది. ఇక నయనతార తాజాగా విగ్నేష్ శివన్ తో పెళ్లి పీటలెక్కడానికి సిద్దమవుతున్న టైం లో మాజీ ప్రేమికుడు ప్రభుదేవాతో నయనతార కలిసి సినిమాలో నటించబోతుంది అంటూ ఓ న్యూస్ బాలీవుడ్ నుండి కోలీవుడ్ వరకు ప్రచారంలోకొచ్చింది.

గతంలో ప్రభుదేవా దర్శకత్వంలో విశాల్ – కార్తీ కాంబోలో ఈశ్వరి నిర్మాతగా ఆర్భాటంగా మొదలైన కరుప్పు రాజా వేలై రాజా సినిమా కొద్దీ రోజులు షూటింగ్ జరుపుకున్నాక అనివార్య కారణాల వలన సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది. అయితే తాజాగా కరుప్పు రాజా వేలై రాజా సినిమా మళ్ళీ పట్టాలెక్కబోతుంది అని.. అందులో ప్రభుదేవా – నయనతార మళ్ళీ కలిసి నటించబోతున్నారంటూ సోషల్ మీడియా ప్రచారం. ఈ వార్తలు చూసిన నిర్మాత ఈశ్వరి.. ఈ న్యూస్ అంత ఫెక్ న్యూస్ అని..కరుప్పు రాజా వేలై రాజా లో ప్రభుదేవా – నయన్ కలిసి నటిస్తున్నారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని.. విశాల్ – కార్తీ కాంబోలో రెండేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా అనుకోకుండా ఆగిపోయింది. మళ్ళీ ఎప్పుడూ ఈ సినిమాని తిరిగి తెరకెక్కిన్చే ప్లాన్స్ ఏం లేవు అని చెబుతుంది నిర్మాత ఈశ్వరి.

Tags:    

Similar News