ఆమె కోసం హాలీవుడ్ నుండి వస్తున్నారు

తమిళనాడు మాజి దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి రాజమౌళి తండ్రి విజేంద్రప్రసాద్ స్టోరీ అందించారు. ఇక [more]

Update: 2019-08-08 06:31 GMT

తమిళనాడు మాజి దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి రాజమౌళి తండ్రి విజేంద్రప్రసాద్ స్టోరీ అందించారు. ఇక దీన్ని తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ‘తలైవి’ అనే టైటిల్ తో తెరకెక్కించనున్నారు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లే ఈ బయోపిక్ లో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తోంది.

స్పెషల్ మేకప్ కోసం….

ఈ బయోపిక్ లో మరో కీలక పాత్ర ఎం.జి.రామచంద్రన్ గా అరవింద్‌ స్వామి నటించబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. కంగనా ను అచ్చం అమ్మ లాగా మార్చెందుకు హాలీవుడ్ నుంచి స్పెషల్ మేకప్ టీమ్ ఇండియాకు రానున్నారు. ఇక ఈ సినిమాకి వంద కోట్లు బడ్జెట్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. కంగనాకు బాలీవుడ్ లో ఎలాగూ మంచి మార్కెట్ ఉంది కాబట్టి అక్కడ ఈమూవీని భారీగా రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

భారీ అంచనాలు….

అమ్మ జయలలిత బయోపిక్ కాబట్టి తమిళంలో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక తెలుగు కన్నడ మలయాళ పరిశ్రమల్లో కూడా ఈ సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి. ఒక స్టేట్ మాజీ సీఎం మీద సినిమా కాబట్టి కచ్చితంగా ఈసినిమా ఈజీగా రికవరీ అవుతాయని చిత్రబృందం భావిస్తోంది. ఈసినిమా కోసం కంగనా తమిళం కూడా నేర్చుకోనుంది. ఇక షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో త్వరలోనే ప్రకటించనున్నారు.

Tags:    

Similar News