టాలీవుడ్ లో నీరుగారింది.. మరి బాలీవుడ్ లో?

ఇప్పుడు బాలీవుడ్, శాండిల్ వుడ్ డ్రగ్ కేసు దేశమంతా చర్చనీయాంశమైంది. డ్రగ్ కేసులో పలువురు హీరోయిన్ల అరెస్ట్ లు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అయితే [more]

Update: 2020-09-13 06:17 GMT

ఇప్పుడు బాలీవుడ్, శాండిల్ వుడ్ డ్రగ్ కేసు దేశమంతా చర్చనీయాంశమైంది. డ్రగ్ కేసులో పలువురు హీరోయిన్ల అరెస్ట్ లు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అయితే బాలీవుడ్ శాండిల్ వుడ్ లలో అరెస్ట్ అయిన హీరోయిన్స్ విషయంలో ఎన్సీబీ కేసు లోతుగా దర్యాప్తు చేస్తుందా? లేదా గతంలో టాలీవడో లో కూడా డ్రగ్స్ కేసు విషయం నీరు గార్చినట్టుగా నీరు కరుస్తుందా అనేది అందరిలో మెదులుతున్న అనుమానం. గతంలో టాలీవుడ్ ని ఓ డ్రగ్ కేసు కుదిపేసింది. అందులో పలువురు ప్రముఖుల పేర్లు బయటికి రావడం ఆతర్వాత వారు విచారణకు హాజరవడం తదుపరి ఆ కేసు ఏమైందో అనేది ఇప్పటికీ మీడియాకి క్లారిటీ లేని ప్రశ్నే.

టాలీవుడ్ లో పూరి జగన్నాధ్, సుబ్బరాజు, రవితేజ, ఛార్మి, నందు, నవదీప్ ఇంకా చాలామంది ఈ డ్రగ్ కేసులో విచారణను ఫేస్ చేసారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ మాదిరి బాలీవుడ్, శాండిల్ వుడ్ డ్రగ్ కేసుని ఎన్సీబీ  నీరు కార్చదు కదా అంటూ అందరిలో హాట్ టాపిక్ గా మారిన చర్చ. ప్రస్తుతం రియా, శాండిల్ వుడ్ లో రాగిణి ద్వివేది, సంజన ల అరెస్ట్ లతో పాటుగా పలువురు ప్రముఖుల పేర్లు బయటికి వస్తున్నాయి. అందులో బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్, సౌత్ హీరోయిన్ రకుల్ పేరు బయట పడగ… మరికొంతమంది పేర్లని రియా ఎన్సీబీ  ముందు బయటపెట్టినట్టుగా ప్రచారం మొదలైంది. అయితే రియా చెప్పిన రకుల్, సారా లని ఎన్సీబీ  అరెస్ట్ చేస్తుందా అనేది అందరిలో ఆసక్తికర ప్రశ్నగా మారింది. లేదంటే బాలీవుడ్ లోను ఎవరైనా ఈ కేసుని పక్కదారి పట్టించిన ఆచ్చర్యపోవక్కర్లేదని అంటున్నారు. చూద్దాం ఈ డ్రగ్ కేసు టాలీవుడ్ లా కాకుండా ఏమైనా సంచలనాలు సృష్టిస్తుందేమో అనేది.

Tags:    

Similar News