‘డిస్కోరాజా’ స్టార్ట్..!

మాస్ మహారాజా రవితేజ, వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం “డిస్కోరాజా”. ఈ చిత్రం ప్రారంభోత్సవం మహా శివరాత్రి పర్వదినాన [more]

Update: 2019-03-04 09:41 GMT

మాస్ మహారాజా రవితేజ, వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం “డిస్కోరాజా”. ఈ చిత్రం ప్రారంభోత్సవం మహా శివరాత్రి పర్వదినాన జరిగింది. నిర్మాత రజని తాళ్ళూరి క్లాప్ కొట్టగా… రామ్ తాళ్ళూరి కెమెరా స్విచాన్ చేశారు. ఈ చిత్రం లో ఆర్ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్, నన్ను దోచుకుందువటే ఫేమ్ నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రేపటినుంచి రెగ్యులర్ షూటింగ్ చేయనున్నారు. నేల టిక్కెట్ తర్వాత ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ అధినేత రామ్ తాళ్ళూరి… రవితేజతో నిర్మిస్తున్న రెండో చిత్రమిది. రామ్ తాళ్ళూరి ఈ చిత్రాన్ని భారీగా నిర్మించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కి మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News