తేజ ఎవరు టచ్ చేయని పాయింట్ తో వస్తున్నాడు

డైరెక్టర్ తేజకి తన సినిమాల రిజల్ట్ తో సంబంధం లేదు. హిట్ అయినా ప్లాప్ అయినా తన స్టైల్ లోనే సినిమాలు తీస్తాడు కానీ ఒకరి కోసం [more]

Update: 2019-06-01 11:44 GMT

డైరెక్టర్ తేజకి తన సినిమాల రిజల్ట్ తో సంబంధం లేదు. హిట్ అయినా ప్లాప్ అయినా తన స్టైల్ లోనే సినిమాలు తీస్తాడు కానీ ఒకరి కోసం మార్చుకోడు. రీసెంట్ గా కాజల్ మెయిన్ లీడ్ లో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సీత అనే సినిమా వచ్చి డిజాస్టర్ అయింది. అయినా తేజ ఏమి పట్టించుకోలేదు. ఎంత మంది ఎన్ని విమర్శలు చేసినా నేను దాన్ని చాలా పాజిటివ్ గా తీసుకుంటా..నా సినిమాకి 3 కంటే ఎక్కువ రేటింగ్ ఇవ్వొద్దని మీడియా పై సెటైర్లు వేసాడు.

అంత హడావిడి చేసినా తేజ మళ్లీ తన పనిలో తాను పడిపోయాడు. ఇప్పటివరకు ఎవరు టచ్ చేసినా ఓ కొత్త పాయింట్ తో తేజ మన ముందుకు రానున్నాడు. అయితే ఈ పాయింట్ తేజ ఎప్పుడో అనుకున్న పాయింట్ అంట. కానీ ఆ సినిమాను చూసే స్థాయికి ఇంకా సమాజం ఎదగలేదని అందుకే ఇప్పటివరకు ఆ సినిమాను తీయలేదని చెప్పాడు. ఇన్నాళ్లకు ఆ టైమ్ వచ్చిందంటున్నాడు ఈ దర్శకుడు.

ఆ పాయింట్ తో సినిమా తీసేందుకు రెడీ అవుతున్నాడు తేజ. ప్రస్తుతం టాలీవుడ్ కొత్త తరహా కథల్ని ఎంకరేజ్ చేస్తోంది కాబట్టి, తన వద్ద ఉన్న ఆ కొత్త పాయింట్ తో ఓ సినిమా చేస్తానంటున్నాడు. ఈమూవీ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇంకా తెలియాల్సిఉంది. అయితే ఈసారి ఎటువంటి పాయింట్ తో వస్తాడు అనేది ప్రేక్షకుల్లో ఇప్పటినుండే ఆసక్తి మొదలైంది.

Tags:    

Similar News