పరుశురామ్ నెక్ట్స్ హీరో ఎవరు?

గీత గోవిందం తరువాత డైరెక్టర్ పరుశురామ్ ఇంతవరకు తన నెక్స్ట్ సినిమా ఏంటో క్లారిటీ ఇవ్వలేదు. మహేష్ తో కానీ, విజయ్ దేవరకొండ తో కానీ పరుశురామ్ [more]

Update: 2019-08-01 08:26 GMT

గీత గోవిందం తరువాత డైరెక్టర్ పరుశురామ్ ఇంతవరకు తన నెక్స్ట్ సినిమా ఏంటో క్లారిటీ ఇవ్వలేదు. మహేష్ తో కానీ, విజయ్ దేవరకొండ తో కానీ పరుశురామ్ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి కానీ దీనిపై పరుశురామ్ మాత్రం క్లారిటీ లేదు. తాజా సమాచారం ప్రకారం పరుశురామ్ లేటెస్ట్ గా మహేశ్ కి ఒక లైన్ చెప్పినట్లు.. లైన్ విన్న మహేశ్ ఫుల్ స్క్రిప్ట్ తో రమ్మని చెప్పినట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి.

పెద్ద హీరోలకు మాత్రమే….

కానీ పరుశురామ్ మహేష్ కోసం స్క్రిప్ట్ మొత్తం రెడీ చేసినప్పటికీ విజయ్ తో ఈలోపు ఒక సినిమా చేద్దాం అని చూస్తున్నాడట. కానీ ఇందులో కూడా నిజం లేదని తెలుస్తుంది. ప్రస్తుతం పరుశురామ్ పెద్ద హీరోలకు కథ చెప్పే పనిలో ఉన్నాడని.. తన కథకు ఏ హీరో ఓకే అంటే.. ఆ హీరోతోనే తన తరువాత సినిమా ఉంటుందట. గీత గోవిందం తో అంత బ్లాక్ బస్టర్ అందుకున్న పరుశురామ్ ఎందుకో ఇంత టైం తీసుకుంటున్నాడు సినిమా చేయడానికి. చూద్దాం ఏ స్టార్ హీరో పరుశురామ్ కి ఛాన్స్ ఇస్తాడో

Tags:    

Similar News