క్రిష్ ఎందుకిలా చేస్తున్నాడు..?

ఎన్టీఆర్ కథానాయకుడు డిజాస్టర్ అవ్వడంతో బాలకృష్ణతో పాటు డైరెక్టర్ క్రిష్ కూడా నిరాశ చెందారు. దీంతో క్రిష్ మీడియా ముందుకు రావడం మానేసాడు. ఇప్పుడు రెండో భాగం [more]

Update: 2019-02-19 07:25 GMT

ఎన్టీఆర్ కథానాయకుడు డిజాస్టర్ అవ్వడంతో బాలకృష్ణతో పాటు డైరెక్టర్ క్రిష్ కూడా నిరాశ చెందారు. దీంతో క్రిష్ మీడియా ముందుకు రావడం మానేసాడు. ఇప్పుడు రెండో భాగం మహానాయకుడు రిలీజ్ దగ్గర పడ్డా ఇంతవరకు క్రిష్ ఎటువంటి ప్రమోషన్స్ చేయడం లేదు. క్రిష్ కనీసం తనవంతుగా సినిమాకి ఎలాంటి ప్రచారం చేయడం లేదు. మహానాయకుడుపై ఎటువంటి బజ్ తీసుకుని రావడం లేదు. కేవలం ఒక్క పరాజయంతోనే క్రిష్‌ లాంటి పేరు పేరున్న దర్శకుడు అజ్ఞాతవాసం చేయడం సినీ ప్రియులకి నచ్చడం లేదు. మొదటి భాగం ఫెయిల్ అయినప్పుడు రెండో భాగంపై అంచనాలు రేకెత్తించే బాధ్యత దర్శకుడిదేనని.. అతనే డీలా పడితే ఎలా అని అంటున్నారు.

ఇద్దరి మధ్య విభేదాలా..?

ఎన్టీఆర్ కథానాయకుడుతో పాటు బాలీవుడ్ మూవీ మణికర్ణిక విషయంలో జరిగిన పరాభవం క్రిష్‌ని మానసికంగా బాగా కృంగదీసిందని, అందుకే ఆయన ఇటువంటి వాటికి దూరంగా ఉంటున్నాడని టాక్. అంతేకాదు బాలకృష్ణ – క్రిష్ కి మధ్య చిన్న గ్యాప్ వచ్చిందనే రూమర్స్ వస్తున్నాయి. క్రిష్ ఒక్కడే కాదు బాలకృష్ణ కూడా ఈ సినిమాకి ఎటువంటి ప్రమోషన్స్ చేయడంలేదు.

Tags:    

Similar News