క్రిష్ అజ్ఞాతవాసిగా మారాడా..?

గత ఏడాది బాలీవుడ్ మణికర్ణిక సినిమాని తెరకెక్కిస్తూ నేషనల్ వైడ్ వార్తల్లో నిలిచిన దర్శకుడు క్రిష్. టాలీవుడ్ లో ఒక మహోన్నత వ్యక్తి జీవిత చరిత్రని తెరకెక్కించి [more]

Update: 2019-03-25 07:00 GMT

గత ఏడాది బాలీవుడ్ మణికర్ణిక సినిమాని తెరకెక్కిస్తూ నేషనల్ వైడ్ వార్తల్లో నిలిచిన దర్శకుడు క్రిష్. టాలీవుడ్ లో ఒక మహోన్నత వ్యక్తి జీవిత చరిత్రని తెరకెక్కించి ప్రస్తుతం ఎవరి కంట పడకుండా మాయమయ్యాడు. ఎన్టీఆర్ బయోపిక్ ని కథానాయకుడు, మహానాయకుడు అంటూ తెరకెక్కించిన క్రిష్ కి రెండు సినిమాలూ డిజాస్టర్స్ కావడంతో చడీ చప్పుడు లేకుండా కామ్ అయ్యాడు. కథానాయకుడు బాగుంది అన్నప్పటికీ ఆ సినిమాకి కలెక్షన్స్ నిల్. ఇక మహానాయకుడుని ప్రేక్షకులు పట్టించుకున్న పాపాన పోలేదు. మరి బాలకృష్ణ చెప్పినట్టుగా ఎన్టీఆర్ బయోపిక్ తీసి క్రిష్ బాగా బుక్కయ్యాడు.

మీడియా ముందుకూ రావడం లేదే….

మరోపక్క మణికర్ణిక వల్ల కూడా క్రిష్ చాలా ఇబ్బందులే పడ్డాడు. కంగనా వల్ల క్రిష్ చాలా లాస్ అయ్యాడు కూడా. పారితోషకం పరంగా. దర్శకత్వపరంగా అన్ని విషయాల్లోనూ క్రిష్ అవమాన పడ్డాడు. కథానాయకుడు హిట్ అన్నాక మాణికర్ణిక విషయంలో క్రిష్ నోరు తెరిచినా మహానాయకుడు దెబ్బకి బెంబేలెత్తిన క్రిష్ ఆ సినిమా విడుదలయ్యాక మళ్లీ మీడియాకి ముఖం చూపించలేదు. అయినా ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో క్రిష్ తప్పేమి లేదు. క్రిష్ డైరెక్టన్ కి పెద్దగా పేరు పెట్టడానికి లేకపోయినా ఎన్టీఆర్ భజన, చంద్రబాబు భజనని ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. అందుకే ఆ రెండు సినిమాలను శంకరగిరి మాన్యాలు పట్టించారు. ప్రస్తుతం క్రిష్ మాత్రం ఎక్కడా ఎవరికీ కనబడకుండా సైలెంట్ అయ్యాడు.

Tags:    

Similar News