దిల్ రాజు బ్యానర్ లో మరో మల్టీస్టారర్‌..!

Update: 2018-10-16 07:19 GMT

దిల్ రాజు బ్యానర్ నుండి ప్రతి ఏడాది కచ్చితంగా ఐదారు సినిమాలు వస్తుంటాయి. టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న పెద్ద ప్రొడ్యూసర్స్ లో దిల్ రాజుకి ఉన్న సక్సెస్ ఇంకా ఎవరికి లేదనే చెప్పాలి. చిన్న సినిమాల నుండి పెద్ద సినిమాలు దాకా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ లో రూపొందుతుంటాయి. రాజుకి స్క్రిప్ట్ నచ్చాలే కానీ ఎవరితో అయినా సినిమా చేసేస్తాడు. ప్రస్తుతం దిల్ రాజు కాంపౌండ్ లో మరో స్క్రిప్ట్ కంప్లీట్ అయింది. స్క్రీన్ ప్లేతో సహా. ‘సమ్మోహనం’తో సమీక్షకులను, ప్రేక్షకులను ఆకట్టుకున్న మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో దిల్‌రాజు ఒక సినిమా నిర్మించనున్న సంగతి తెలిసిందే. దానికి సంబంధించి మోహన్ కృష్ణ స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ చేశారు. గత మూడు నాలుగు నెలలుగా ఆయన కథపై వర్క్‌ చేశారు.

మరి హీరోలు ఎవరో..?

కథ ప్రకారం ఇందులో ఇద్దరు హీరోలకు ఛాన్స్ ఉంది. మరి ఆ ఇద్దరు హీరోలు ఎవరు అనేది ఇంకా రివీల్ చేయలేదు దర్శకనిర్మాతలు. ఈ మల్టీస్టారర్‌ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’ విడుదల తర్వాత సెట్స్ మీదకు వెళ్లనుంది. దిల్ రాజు బ్యానర్ లో ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఎఫ్‌2 చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది.

Similar News