రాజుగారికి.. హీరోలు దొరికేసారా?

Update: 2018-07-15 07:50 GMT

దిల్ రాజు బ్యానర్ లో ఇప్పుడు వరసబెట్టి మల్టీస్టార్స్ తెరకెక్కుతున్నాయి. దిల్ రాజుకు సినిమాల మీద ఉన్న కమిట్మెంట్ తో ఆయన వరసబెట్టి మీడియం బడ్జెట్ లో ఇలా చక్కటి మల్టీస్టారర్ చిత్రాలను ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇప్పటికే అనిల్ రావిపూడితో ఫన్ అండ్ ఫ్రస్టేషన్ వెంకటేష్, వరుణ్ తేజ్ లతో కలిసి నిర్మిస్తున్న దిల్ రాజు సమ్మోహనంతో అందరిని సమ్మోహన పరిచిన ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో మరో మల్టీస్టారర్ ని నిర్మించబోతున్నాడు. ఈ సినిమాని కూడా మీడియం బడ్జెట్ లో అందరు మెచ్చేలా యాక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తరహాలోనే ఇంద్రగంటి తెరేకేక్కిస్తున్నాడనే టాక్ ఉంది.

అయితే ఈ సినిమా కోసం దిల్ రాజు అండ్ ఇంద్రగంటి మోహన కృష్ణ లు హీరోలను సెలెక్ట్ చేస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. గతంలో దిల్ రాజు నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో దాగుడు మూతల కోసం హరీష్ అనుకున్న నితిన్ - శర్వానంద్ లో ఒకరైనా శర్వానంద్ ఇప్పుడు దిల్ రాజు కోసం ఇంద్రగంటి తెరకెక్కించబోయే ఈ మల్టీస్టారర్ లో నటించబోతునట్టుగా వార్తలొస్తున్నాయి. హరీష్ శంకర్ రాసుకున్న దాగుడు మూతలు కథకి తాజాగా పెద్ద హీరోలను, అలాగే మెగా హీరోలను అనుకోవడంతో నితిన్ అండ్ శర్వానంద్ లు ఈ మల్టీస్టారర్ నుండి డ్రాప్ అయినట్లుగా గతంలో వార్తలొచ్చాయి.

అయితే ఎలాగూ శర్వా తో పాటుగా హీరో నాని డేట్స్ ఉన్న దిల్ రాజు ఇప్పుడు ఇంద్రగంటి మల్టీస్టారర్ కోసం శర్వానంద్ అండ్ హీరో నాని ని ఎంపిక చేసినట్లుగా తెలుస్తుంది. మరి నాని ఇప్పటికే దిల్ రాజు నిర్మాణంలో బోలెడన్ని హిట్స్ కొట్టాడు. అందుకే దిల్ రాజు అడగ్గానే ఈ మల్టిస్టారర్ కోసం ఒప్పుకున్నల్టుగా తెలుస్తుంది. ఇక నాని ప్రస్తుతం నాగ్ తో కలిసి ఒక మల్టీస్టారర్ చేస్తున్నాడు. శర్వానంద్ పడి పడి లేచే మనసు తో పాటుగా... సుధీర వర్మ మూవీలో నటిస్తున్నాడు

Similar News