దిల్ రాజు ఒక్కడినే ఎందుకు పిలిచారు?

ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై అవగాహన కోసం చాలామంది సెలెబ్రెటీస్ కి ఇన్వైట్ చేశారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నుంచి చాలా మంది [more]

Update: 2019-10-22 07:04 GMT

ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై అవగాహన కోసం చాలామంది సెలెబ్రెటీస్ కి ఇన్వైట్ చేశారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నుంచి చాలా మంది సెలెబ్రెటీస్ వచ్చారు కానీ సౌత్ నుంచి ఒక్కరిని కూడా ఇన్వైట్ చేయలేదు పిఎంఓ. దాంతో మన సౌత్ జనాలు ప్రభుత్వ పరంగా దక్షిణాది మీద చూపిస్తున్న వివక్షపై మండిపడుతున్నారు. కాకపోతే ఈ కార్యక్రమానికి మన సౌత్ నుంచి దిల్ రాజు అటెండ్ కావడం విశేషం.

దిల్ మోడీ….

సౌత్ నుంచి చాలామంది స్టార్స్ ని కాదని దిల్ రాజు ఒకరినే ఇన్వైట్ చేసారు. మొదట దిల్ రాజు ఉన్నట్లుగా కనిపిస్తున్న ఫొటో మార్ఫింగా అన్న సందేహాలు కూడా తలెత్తాయి. మోదీ స్వయంగా రిలీజ్ చేసిన ఫొటోలలో దిల్ రాజు కనిపించారు. అందులో క్లియర్ గా ఉంది. ఆ కొద్దిసేపటికే దిల్ రాజు తన అకౌంట్ లో తన ఫోటో పెట్టి మోదీ ని అభినందిస్తూ ట్వీట్ చేసాడు. అసలు దిల్ రాజు ఒక్కడినే ఈ సమావేశానికి ఎందుకు ఆహ్వానించారు. మిగతా వాళ్ల పరిస్థితేంటో అన్న చర్చ మొదలైంది. బహుశా దిల్ రాజు జెర్సీ సినిమాతో హిందీ లో కి ఎంటర్ అవుతున్నారు కాబట్టి ఆయనను ఒక్కరినే పిలిచి ఉంటారు అని అనుకుంటున్నారు.

 

 

Tags:    

Similar News