భారీ రేట్ కి సాహో నైజాం రైట్స్ కొన్న దిల్ రాజు

బాహుబలి సిరీస్ తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుండి వస్తున్నా చిత్రం ‘సాహో’. యంగ్ డైరెక్టర్ సుజీత్ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నారు. [more]

Update: 2019-06-08 07:32 GMT

బాహుబలి సిరీస్ తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుండి వస్తున్నా చిత్రం ‘సాహో’. యంగ్ డైరెక్టర్ సుజీత్ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నారు. ప్రభాస్ కి జోడిగా తొలిసారిగా శ్రద్ధా కపూర్ నటిస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ తో తెరకెక్కుతున్న ఈసినిమా పై భారీ అంచనాలు ఉండటంతో, డిస్ట్రిబ్యూషన్ హక్కుల కోసం పోటీ పెద్ద ఎత్తున వున్నట్టుగా తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో నైజాం మార్కెట్ వేరు. ఏ సినిమా రిలీజ్ అయినా నైజాం మార్కెట్ కీలకం అవుతుంది. అందుకే నైజాం కి క్రేజ్ ఎక్కువ. ఇప్పటికే నైజామ్ .. ఉత్తరాంధ్ర ఏరియాల డిస్ట్రిబ్యూషన్ హక్కులు తనకి ఇవ్వమంటూ దిల్ రాజు 45 కోట్లను ఆఫర్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.

ఈ స్థాయిలో పోటీపడే డిస్ట్రిబ్యూటర్స్ లేకపోవడం వలన, ఈ ఏరియాల్లో డిస్ట్రిబ్యూషన్ హక్కులు దిల్ రాజుకి ఖాయమైనట్టేనని అంటున్నారు. ఇక ఈమూవీ తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లో ఆగస్టు 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. దాదాపు 300 కోట్లు తో ఈమూవీ తెరకెక్కుతుంది. అలానే దిల్ రాజు ప్రభాస్ తో ఓ భారీ చిత్రం చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట

Tags:    

Similar News