మరో భారీ మల్టీస్టారర్ తీస్తున్న దిల్ రాజు

Update: 2018-07-12 08:18 GMT

తెలుగు ఇండ‌స్ట్రీలో మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలు క‌నుమ‌రుగైన సంద‌ర్భంలో 'సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు' వంటి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను వెంకటేశ్‌, మ‌హేశ్ వంటి స్టార్ హీరోల‌తో తెర‌కెక్కించి మల్టీస్టార‌ర్ చిత్రాల‌కు నిర్మాత దిల్‌రాజు నాంది పలికారు. అక్క‌డి నుండి మ‌ల్టీస్టార‌ర్ చిత్రాల సంఖ్య పెరుగుతూ వ‌స్తున్నాయి. ఈ ఏడాది దిల్‌రాజు ఇప్ప‌టికే వెంక‌టేశ్‌, వ‌రుణ్‌తేజ్‌ల‌తో 'ఎఫ్ 2'(ఫ‌న్ అండ్ ఫ్ర‌స్టేష‌న్‌) అనే మ‌ల్టీస్టార‌ర్ తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఇంద్రగంటితో దర్శకత్వంలో...

ఇది కాకుండా మ‌రో మ‌ల్టీస్టార‌ర్‌కు శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీకారం చుడుతున్నారు దిల్‌ రాజు. 'అష్టాచ‌మ్మా, గోల్కొండ హైస్కూల్‌, అమీ తుమీ, జెంటిల్‌మన్‌, స‌మ్మోహ‌నం' వంటి డిఫ‌రెంట్‌, సెన్సిబుల్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన డైరెక్ట‌ర్ ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో మ‌ల్టీస్టార‌ర్ తెర‌కెక్క‌నుంది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనుంది ఈ చిత్రం. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివ‌రాల‌ను చిత్ర‌ యూనిట్ తెలియ‌జేస్తుంది.

Similar News