ఫ్యాన్సీ రేటుకు దిక్సూచి హిందీ రైట్స్

Update: 2018-08-27 12:46 GMT

బాలనటుడిగా 30 సినిమాలు. నెంబర్ వన్ సినిమాతో 1993 లో సినిమాల్లొకి ఎంట్రీ. అనంతరం భలే మావయ్య, ధర్మ చక్రం, పొకిరి రాజా, స్నేహం కొసం, బావగారు బాగున్నారా, అన్నయ్య, నుంచి "జయం" వరకు చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిన ఆ బాలుడు కాస్త కుర్రాడిగా మారి హీరోగా రూపాంతరం చెంది నాలుగు సినిమాలు చెసెశాడు. అది కూడా తెలుగు, తమిళం, మళయాళ బాషల్లో.. నటుడిగా 25 ఏళ్లు పూర్తి చెసుకోబోతోన్న ఆ కుర్రాడీ పేరు దిలీప్. దిలీప్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం "దిక్సూచి". డివొషనల్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శైలజ సముద్రాల, నరసింహ రాజు రాచూరి నిర్మిస్తున్నారు.‌ బేబి సనిక సాయి శ్రీ రాచూరి సమర్పణలొ ఎస్.ఆర్.ఎస్. అసొసియేట్స్ ప్రై లిమిటెడ్ పతాకంపై తెరకెక్కతోన్న ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చెసుకొని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది.

పోస్టర్ చూసి కొనుక్కున్నారు...

ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు-దర్శకుడు దిలీప్ మాట్లాడుతూ.. "ఈ తరహా కథాంశంతో ఇప్పటివరకూ తెలుగులో సినిమా రాలేదు. మూడు జోనర్స్ మిక్సింగ్ గా రూపొందిన సినిమా ఇది. 1970 నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రొటీన్ కి భిన్నంగా ఉండబోతోంది. కేవలం పోస్టర్ చూసి హిందీ డబ్బింగ్ రైట్స్ ను ఓ ప్రముఖ సంస్థ భారీ రేట్ కి కొనుక్కోవడం విశేషం. ఒక డిఫరెంట్ స్టోరీ లైన్ తో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారన్న నమ్మకం ఉంది. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తాం" అన్నారు.

Similar News