దేవిని అందుకే సైడ్ చేశారా..?

మొదటి మూడు సినిమాలు అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఇప్పుడు నాలుగో సినిమా ఎట్టి పరిస్థితిలో హిట్ అవ్వాలని అక్కినేని ఫ్యామిలీతో పాటు అల్లు అరవింద్ కూడా కంకణం [more]

Update: 2019-04-25 11:14 GMT

మొదటి మూడు సినిమాలు అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఇప్పుడు నాలుగో సినిమా ఎట్టి పరిస్థితిలో హిట్ అవ్వాలని అక్కినేని ఫ్యామిలీతో పాటు అల్లు అరవింద్ కూడా కంకణం కట్టుకుని ఉన్నారు. అఖిల్ నాలుగో మూవీని ‘బొమ్మరిల్లు’ భాస్కర్ డైరెక్ట్ చేయనున్నాడు. ఈ సినిమాను గీత ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ ను అనుకున్నారు. అయితే ఇప్పుడు టీం మాత్రం దేవిని వద్దు అంటుంది. సరే తమన్ అనుకున్నారు కానీ ఆయనను కూడా వద్దనుకున్నారు. లాస్ట్ కి గోపీసుందర్ ని ఓకే చేసుకున్నారు.

బడ్జెట్ ను కంట్రోల్ చేయడానికి…

దేవిని వద్దు అనుకోవడానికి కారణం బడ్జెట్ అంట. ఈ సినిమా బడ్జెట్ ను సాధ్యమైనంత తగ్గించాలనే ఉద్దేశంతోనే అల్లు అరవింద్.. గోపీసుందర్ ను తీసుకున్నాడని అంటున్నారు. అయితే అఖిల్ మాత్రం దేవి, తమన్ లకే ఇంట్రెస్ట్ చూపాడట. గోపి సుందర్ పాటలకు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. అందుకే గోపి సుందర్ రెమ్యూనరేషన్ కూడా తక్కువ తీసుకుంటున్నాడు కాబట్టి అల్లు అరవింద్ అతని వైపు మొగ్గు చూపాడట. ఏది ఏమైనా అఖిల్ సినిమాకు మంచి పేరు రాకపోతే అఖిల్ కెరీర్ పై ఎఫెక్ట్ పడేలా ఉంది. అఖిల్ పక్కన హీరోయిన్స్ ఇంకా ఫైనల్ అవ్వాల్సిఉంది.

Tags:    

Similar News