అందుకే ఆ నిర్ణయం తీసుకున్నా

దేవిశ్రీ ప్రసాద్. ఈ పేరు వింటే మనకి ముందు సూపర్ హిట్ సాంగ్స్ గుర్తొస్తాయి. ముఖ్యంగా యూత్ ను హుషారెత్తించే పాటలు చాలా చేసాడు. ఐటెం సాంగ్స్ [more]

Update: 2019-05-25 08:19 GMT

దేవిశ్రీ ప్రసాద్. ఈ పేరు వింటే మనకి ముందు సూపర్ హిట్ సాంగ్స్ గుర్తొస్తాయి. ముఖ్యంగా యూత్ ను హుషారెత్తించే పాటలు చాలా చేసాడు. ఐటెం సాంగ్స్ ఇవ్వడంలో కూడా మంచి ఎక్స్పర్ట్. ఒకప్పుడు సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చిన దేవి ఈ మధ్య సరిగా ఇవ్వలేకపొతున్నాడు. సంగీతంపరంగా ఈ మధ్య జోరు తగ్గిందనే టాక్ బలంగా వినిపిస్తోంది. పెద్ద పెద్ద సినిమాలకి కూడా మంచి ట్యూన్స్ ఇవ్వలేకపొతున్నాడు. ఉదాహరణకు ఈ మధ్య కాలంలో వచ్చిన ‘వినయ విధేయ రామా’, మహర్షికి బాణీల్లో అంతగా పసలేదనే విమర్శలు వినిపించాయి.

ఇక స్టార్ హీరోల సినిమాలే

ఈ విషయంపైనే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ నడించింది. ఈ ట్రోల్స్ దేవి దాకా వెళ్లడంతో ఆయన ఓ నిర్ణయానికి వచ్చాడట. ఎక్కువ సినిమాలు ఒకేసారి ఒప్పుకోవడం వల్లనే హీరోస్ కి సరైన ట్యూన్స్ ఇవ్వలేకపోతున్నాని దేవిశ్రీ ప్రసాద్ భావించాడట. అందుకే ఇప్పటి నుండి స్టార్ హీరోస్ సినిమాలు మాత్రమే చేయాలనీ, చిన్న, మీడియం సినిమాలకు దూరంగా ఉండాలని ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది.

Tags:    

Similar News