దేవిశ్రీ ప్రసాద్ అందుకే తప్పుకున్నారా..?

మహేష్ బాబు మహర్షి కోసం దేవిశ్రీ ప్రసాద్ ఏడాదిన్నర కష్టపడి మరీ మ్యూజిక్ ఇచ్చాడు. అయితే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ని ప్రేక్షకులు అంతగా ఎంజాయ్ చేయలేకపోయారు. [more]

Update: 2019-05-21 06:39 GMT

మహేష్ బాబు మహర్షి కోసం దేవిశ్రీ ప్రసాద్ ఏడాదిన్నర కష్టపడి మరీ మ్యూజిక్ ఇచ్చాడు. అయితే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ని ప్రేక్షకులు అంతగా ఎంజాయ్ చేయలేకపోయారు. దేవిశ్రీ మ్యూజిక్ లో పస తగ్గిందనే కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వినబడ్డాయి. ఇక మహర్షి మైనస్ లో దేవిశ్రీ మ్యూజిక్ ఒకటి. మరి అలాంటి టైంలో హరీష్ శంకర్ – వరుణ్ తేజ్ కాంబోలో తెరకెక్కుతున్న తమిళ రీమేక్ వాల్మీకి సినిమా నుండి దేవిశ్రీ ప్రసాద్ అవుట్ అనే టాక్ బాగా వినబడడమే కాదు దేవిశ్రీ వాల్మీకి ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడన్నది నిజం. కానీ కారణాలు మాత్రం తెలియరాలేదు.

రీమిక్స్ సాంగ్ కోసమే

తాజాగా దేవిశ్రీ, హరీష్ శంకర్ వాల్మీకి నుండి తప్పుకోవడానికి అసలు కారణమేమిటో ఇప్పుడు తెలిసింది. అదేమిటంటే దర్శకుడు హరీష్ శంకర్ ఒక రీమిక్స్ సాంగ్ అనుకున్నాడట. వాల్మీకికి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపికైన దేవిశ్రీ ప్రసాద్ తో తన మనసులో మాట చెప్పి.. సినిమాలో రీమిక్స్ సాంగ్ గనుక ఉంటే అది మాస్ ప్రేక్షకులను ఓ ఊపు ఊపేస్తుందని చెప్పగా దానికి దేవిశ్రీ నో చెప్పాడట. తాను రీమిక్స్ సాంగ్స్ చెయ్యనని నియమం పెట్టుకున్నానని చెప్పాడట. హరీష్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా ఆ రీమిక్స్ సాంగ్ ని దేవిశ్రీతో చెయ్యాలని ప్రయత్నించాడట. అందుకే విసిగిపోయిన దేవిశ్రీ ప్రసాద్ వాల్మీకి ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడని ఫిలింనగర్ టాక్.

Tags:    

Similar News