బిగ్ బాస్ పై ట్రోలింగ్!!

బిగ్ బాస్ సీజన్ 4 అసలే చిన్న చిన్న పేరు లేని కంటెస్టెంట్స్ తో చప్పగా స్టార్ట్ అయ్యింది అంటే.. ఎలాగో టాస్క్ ల పేరు చెప్పి [more]

Update: 2020-09-29 04:30 GMT

బిగ్ బాస్ సీజన్ 4 అసలే చిన్న చిన్న పేరు లేని కంటెస్టెంట్స్ తో చప్పగా స్టార్ట్ అయ్యింది అంటే.. ఎలాగో టాస్క్ ల పేరు చెప్పి బిగ్ బాస్ హౌస్ లో మంటలు అంటించి.. నామినేషన్స్ పేరు మీద అందరిలో చిచ్చు రగిలించి.. కాస్త దారిలో కి తెచ్చిన యాజమాన్యం మళ్ళి ఇప్పుడు ఓ పిచ్చి పని చేసి ట్రోలింగ్ కి గురైంది. బిగ్ బాస్ హౌస్ గురించి సీజన్ 4 గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో రకరకాలుగా ట్రోల్ అవుతుంటే ఇప్పుడు చిన్నా చితక కంటెస్టెంట్స్ ని హౌస్ లో ఉంచి మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేయడమనేది బిగ్ బాస్ సీజన్ 4 లో చేసిన అతిపెద్ద మిస్టేక్ అనిపిస్తుంది. కుమార్ సాయి, సోహెల్, మెహబూబ్, అరియనా, గంగవ్వ లాంటి వీక్ కంటెస్టెంట్స్ ని హౌస్ లో ఉంచి దేవి నాగవల్లిని ఎలిమినేషన్ ద్వారా బయటికి పంపడమనేది చాలా సిల్లీగా అనిపిస్తుంది.

దేవి చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్. టాస్క్ కానివ్వండి, స్టాండ్ తీసుకోవడం కానివ్వండి, పనిలో కానివ్వండి ఎందులోనైనా దేవితో పోటీ పడేది కేవలం ఆబ్బాయిలు మాత్రమే అనేలాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ దేవి నాగవల్లి. అలాంటి అమ్మాయిని ఎలిమినేషన్ లో ఉంచి ఫైనల్ గా ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా ఎలినేషన్ అనేది ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. టివి 9 మీదున్న నెగెటివిటి దేవి మీద పడింది అని కొందరు…. పవన్ కళ్యాణ్ ఫాన్స్ కావాలనే దేవి నాగవల్లిని ఎలిమినేట్ అయ్యేలా ఓట్స్ వేశారంటూ ఏవేవో సోషల్ మీడియాలో వినిపిస్తున్నా దేవి నాగవల్లి ఎలిమినేషన్ తో బిగ్ బాస్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మాత్రం భీబత్సంగా సాగుతుంది. కుమర్ సాయి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చి వెస్టు అనిపించుకున్నాడు. అలాంటి కంటెస్టెంట్ ని ఉంచి దేవిని ఎలిమినేట్ చెయ్యడం నిజంగా పొరబాటే. టాస్క్ లో వీరత్వం, మాటల్లో సూరత్వం లాంటి దేవిని ఎలిమినేట్ చేసి బిగ్ బాస్ హౌస్ ఎలా వీక్ కంటెస్టెంట్స్ తో ఎంతసేపు డ్రామా ప్లే చేస్తారో.. ఏ విధంగా టీఆర్పీ పెంచుకుంటారో చూస్తామంటున్నారు నెటిజెన్స్.

Tags:    

Similar News