పొంతలేని సమాధానాలతో కన్ఫ్యూజ్ చేసిన దీపికా?

దేశం అంతటా.. ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణంపై గుండెపగిలి బాధతో.. శోకతప్త హృదయాలతో ఆయనకు ఆశృనివాళులు అర్పిస్తుంటే…. బాలీవుడ్ లో మాత్రం డ్రగ్స్ కేసు రకరకాల మలుపులు తిరుగుతుంది. [more]

Update: 2020-09-27 14:37 GMT

దేశం అంతటా.. ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణంపై గుండెపగిలి బాధతో.. శోకతప్త హృదయాలతో ఆయనకు ఆశృనివాళులు అర్పిస్తుంటే…. బాలీవుడ్ లో మాత్రం డ్రగ్స్ కేసు రకరకాల మలుపులు తిరుగుతుంది. నేషనల్ మీడియా, సౌత్ మీడియా మొత్తం బాలు గారి అంతక్రియలను న్యూస్ చేసుకుంటుంటే.. బాలీవుడ్ మీడియా మొత్తం డ్రగ్స్ కేసులో సమన్లు అందుకుని ఎన్ సీబీ ఎదుట హాజరవుతున్న హీరోయిన్స్  మీద ఫోకస్ పెట్టింది. నిన్న ఎన్ సీబీ ఎదుట రకుల్ ప్రీత్ హాజరవగా నేడు టాప్ హీరోయిన్ దీపికా పదుకొనే, శ్రద్ద కపూర్, సారా అలీఖాన్ లు హాజరయ్యారు. దీపికా పాడుకొనే తో ఆమె భర్త రణ్వీర్ సింగ్ హాజరవుతాడని.. అందుకోసం రణ్వీర్ ఎన్ సీబీ అధికారులకు పిటిషన్ పెట్టుకున్నాడని అన్నప్పటికీ…ఆదేమి లేదని దీపికా మాత్రం ఒంటరిగానే విచారణకు హాజరవుతున్నట్టుగా ఈ మెయిల్ పంపిందట ఎన్ సీబీ అధికారులకి.

ఇక ఈ రోజు ఉదయం దీపికా పదుకొనే ఒంటరిగానే ఎన్ సీబీ ఎదుట విచారణకు హాజరవగా.. అక్కడ ఎన్ సీబీ ఎదుట దీపికా పదుకొనె పొంతనలేని సమాధానాలతో ఎన్ సీబీ అధికారులని కన్ఫ్యూజ్ చేసినట్లుగా చెబుతున్నారు. తన మేనేజర్ కరిష్మా తో తనకు కెరీర్ కి సంబందించిన సాధారణ సంబంధాలు తప్ప డ్రగ్స్ సంబంధాలు లేవని ఎన్ సీబీ ఎదుట దీపికా చెప్పినట్టుగా చెబుతున్నారు. ఇక దీపికా ని కొంతమంది అధికారులు ప్రశ్నిస్తుండగా.. మరో హీరోయిన్ శ్రద్ద కపూర్ ని మరికొంతమంది అధికారులు విచారిస్తున్నారని తెలుస్తుంది. ఇక సారా అలీఖాన్ ని కూడా కొంతమంది అధికారులు ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీపికా సమాధానాలు తమకు సంతృప్తి కరంగా లేవని ఎన్ సీబీ అధికారులు చెబుతున్నారు. ఇక ఇదిలా ఉండగా 2019 లో కరణ జోహార్ ఇచ్చిన పార్టీలో డ్రగ్స్ వాడకంపై కూడా ఎన్ సీబీ దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది.

Tags:    

Similar News