రానా కూడా రాజమౌళి ని…!!

మొన్నటివరకు టాలీవుడ్ లో కామెడీ హర్రర్స్ ట్రెండ్ అయితే నిన్నటివరకు బయోపిక్స్ ట్రేడ్ గా నడిచాయి. ఇక రానున్న రోజుల్లో ఈ ట్రెండ్ కూడా మారి కొత్త [more]

Update: 2018-12-27 08:49 GMT

మొన్నటివరకు టాలీవుడ్ లో కామెడీ హర్రర్స్ ట్రెండ్ అయితే నిన్నటివరకు బయోపిక్స్ ట్రేడ్ గా నడిచాయి. ఇక రానున్న రోజుల్లో ఈ ట్రెండ్ కూడా మారి కొత్త ట్రేడ్ కు శ్రీకారం చుట్టున్నారు మేకర్స్. అదే పీరియాడిక్ మూవీస్. మనకి ఇవేమి కొత్త కాదు. రీసెంట్ గా #RRR కూడా పీరియాడిక్ కథతోనే తెరకెక్కుతుంది. ఇప్పుడు మరో సినిమా కూడా పీరియాడిక్ కథతో రూపొందనుంది.

రానా హీరోగా…..

ఇందులో ఎటువంటి అబద్దం లేదు. ఇది నిజం. దగ్గుబాటి రానా హీరో గా ఓ పీరియాడిక్ కథ త్వరలోనే తెరకెక్కనుంది. ఈ విషయాన్ని దర్శకుడు వేణు ఉడుగుల స్పష్టంచేశాడు. ‘నీది నాది ఒకే కథ’ సినిమాతో పాపులర్ అయిన ఈ డైరక్టర్.. విరాటపర్వం సినిమా 50 ఏళ్ల టైమ్ గ్యాప్ లో జరుగుతుందని చెబుతున్నాడు.

శర్వా ఏం చెప్పకపోవడంతో….

వీరి కాంబినేషన్ లో సినిమా వస్తుందని తెలిసినా అది పీరియాడిక్ మూవీ అని ఎవరికి తెలియదు. ఇప్పటివరకు వచ్చిన పీరియాడిక్ సినిమాలకు భిన్నంగా ఇది ఉంటుందని చెబుతున్నారు. రానా కి జోడిగా సాయి పల్లవి ని సంప్రదిస్తునట్టు సమాచారం. ఆమె ఓకే చెప్పితే త్వరలోనే సెట్స్ మీదకు తీసుకుని వెళ్లనున్నారు. మొదట ఈసినిమాకి శర్వానంద్ ని అనుకున్నారు. కానీ శర్వా ఏ విషయమూ చెప్పకపోవడంతో ఇప్పుడు ఆ కథ రానా దగ్గరకు వెళ్ళింది. కథ విన్న రానా వెంటనే ఓకే చేసేసాడట. స్క్రిప్ట్ వర్క్ కూడా దాదాపు ఫినిష్ అవ్వడంతో త్వరలోనే అధికారంగా అనౌన్స్ చేయనున్నారు అని తెలుస్తుంది.

Tags:    

Similar News