శ్రీ రెడ్డి , అభిరామ్ వ్యవహారం పై నోరు విప్పిన సురేష్ బాబు

Update: 2018-06-22 05:42 GMT

టాలీవుడ్ అగ్ర నిర్మాతలలో ఒకరైన దగ్గుపాటి సురేష్ బాబు మొదటి సారి తన కుమారుడు దగ్గుపాటి అభిరాం మరియు సినీ నటి శ్రీ రెడ్డి వ్యవహారం ఫై స్పందించాడు. గత కొన్ని నెలలుగా మీడియా లో అభిరాం, శ్రీ రెడ్డి ల సంబంధం పై , వారు కలసి ఉన్న ఫోటో ల పై విస్తృత ప్రచారము, చర్చ జరిగిన విషయం విదితమే.

ఈ విషయం పై ఒక ప్రముఖ మీడియా ఛానల్ తో సురేష్ బాబు మాట్లాడుతూ, ఇది తమ వ్యక్తిగత విషయమని, దీనిని గూర్చి బహిరంగ చర్చ అనవసరమని, మా వ్యక్తిగత పరిధిలో ఈ విషయాన్నీ పరిష్కరించుకోగలమని తెలియ జేశారు.

ప్రతి కుటుంబములో ఎన్నో రోజు వారి సమస్యలు ఉంటాయని , వాటిని పరిష్కరించే వ్యక్తుల దగ్గర మాత్రామే చర్చిస్తాం తప్ప, ఆ సమస్యలను అందరితో పంచుకోవలసిన అవసరం లేదని కుండ బద్దలు కొట్టినట్లుగా తెలియ జేశారు సురేష్ బాబు.

నటి శ్రీ రెడ్డి దగ్గుపాటి అభిరాం, శేఖర్ కమ్ముల , పవన్ కళ్యాణ్, హీరో నాని ల పై తీవ్రమైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కేవలం నాని వల్లనే తాను బోగ్ బాస్ - 2 షో కు దూరమవ్వాల్సి వచ్చిందనే ఆరోపణ కూడా చేసింది.

Similar News