హీరోయిన్స్ @ కరెంట్ షాక్?

ఇప్పుడు కరోనా లాక్ డౌన్ కారణంగా చిన్న, పెద్ద, పేద అందరూ రకరకాల ప్రోబ్లెంస్ తో బాధపడుతుంటే.. ప్రభుత్వాలు మాత్రం కరెంట్ షాకులిస్తుంది. కొంతమంది కరెంట్ బిల్లుల [more]

Update: 2020-06-30 05:52 GMT

ఇప్పుడు కరోనా లాక్ డౌన్ కారణంగా చిన్న, పెద్ద, పేద అందరూ రకరకాల ప్రోబ్లెంస్ తో బాధపడుతుంటే.. ప్రభుత్వాలు మాత్రం కరెంట్ షాకులిస్తుంది. కొంతమంది కరెంట్ బిల్లుల కారణంగా రోడ్డెక్కి ధర్నాలు చేస్తూ ప్రభుత్వాలను   ప్రశ్నిస్తుంటే.. సెలబ్రిటీస్ మాత్రం సోషల్ మీడియా వేదికగా తమ నిరసన తెలుపుతున్నారు. మొన్నామధ్యన స్నేహ భర్త ప్రసన్న తమ ఇంటికి 7 వేలు రావాల్సిన కరెంట్ బిల్.. 70 వేలు వచ్చింది అంటూ సోషల్ మీడియాలో తన బాధను షేర్ చేసాడు. ఇక తమిళ హీరోయిన్, మాజీ హీరోయిన్ రాధా కూతురు కార్తీక కూడా తనకి కరెంట్ బిల్ వాచిపోయింది అంటూ సోషల్ మీడియాలో తన బాధను పంచుకుంది.

తాజాగా సౌత్ లో ఆఫర్స్ లేక బాలీవుడ్ కి చెక్కేసి అక్కడ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతున్న హీరోయిన్ తాప్సి ఇప్పుడు కరెంట్ బిల్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. తాను అసలు ఇంట్లో ఉండను అని కానీ అప్పుడప్పుడు వెళ్లి ఇంటిని క్లీన్ చేస్తూ ఉంటామని.. అలాంటిది తన ఇంటి కరెంట్ బిల్ ఏకంగా 36,000 వచ్చింది అని అంటుంది. ఏప్రిల్, మే లలో మినిమమ్ అంటే 4000 నుండి 3000 వరకు కటీరెంట్ బిల్ వస్తే.. జూన్ బిల్ మాత్రం 36,000 వచ్చింది అని.. నేను ఇంట్లోనే ఉండనని… అది ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది అని, నేను ఆ ఇంటి కోసం కొత్త ఎలెక్ట్రిక్ వస్తువులు కూడా కొనలేదని అలాంటిది ఇంత కరెంట్ బిల్ ఎలా వస్తుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది తాప్సి. ఖాళీ గ ఉన్న ఇంటికీ అంత బిల్ వస్తే.. అందులో ఉండి ఉంటే ఇంకెంత బిల్ వచ్చేదో అంటుంది. 

Tags:    

Similar News