శర్వానంద్ సినిమాలో సీనియర్ హీరోయిన్..?

Update: 2018-08-11 06:50 GMT

శర్వానంద్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ‘పడి పడి లేచె మనసు’ సినిమాను ‘కృష్ణ గాడి వీర ప్రేమగాథ’ ఫేమ్ హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్నాడు. లేటెస్ట్ గా ఈ చిత్రం కలకత్తాలో భారీ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. దాదాపు టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ లోకి వెళ్లనుంది. ఇక ఈ చిత్రం పాటు శర్వా మరో చిత్రంలో కూడా నటిస్తున్నాడు.

డాక్టర్ గా ఫిదా పిల్ల

‘స్వామి రారా’ ఫేమ్ సుధీర్ వర్మ డైరెక్షన్ శర్వా నటిస్తున్నాడు.ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం వాయిదా వేశారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ‘పడిపడి లేచె మనసు’ షూటింగ్ నేపాల్ లో జరిగనున్న ఈ చివరి షెడ్యూల్ తో పూర్తికానుంది. ఇందులో శర్వా ఫుట్ బాల్ ప్లేయర్ గా నటిస్తుండగా సాయి పల్లవి డాక్టర్ పాత్రలో కనిపించనుంది.

అతిథి పాత్రలో కాజోల్

ఇక ఈ మూవీలో సీనియర్ హీరోయిన్ కాజోల్ అతిథి పాత్రలో కనిపించనుంది. అయితే దీనికి సంబంధించి అధికార ప్రకటన రావాల్సఉంది. చెరుకూరి సుధాకర్, చుక్కపల్లి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే ఈ సినిమా పూర్తి వివరాలు తెలియజేయనున్నారు మేకర్స్.

Similar News