విడుదలైన ఇన్నాళ్ళకి మేలుకొన్నారా?

నితిన్ – రశ్మిక జంటగా వెంకీ కుడుములు దర్శకత్వంలో తెరకెక్కిన భీష్మ సినిమా ఫిబ్రవరి 21 న విడుదల కావడం బ్లాక్ బస్టర్ హిట్ కావడం జరిగింది. [more]

Update: 2020-03-13 06:44 GMT

నితిన్ – రశ్మిక జంటగా వెంకీ కుడుములు దర్శకత్వంలో తెరకెక్కిన భీష్మ సినిమా ఫిబ్రవరి 21 న విడుదల కావడం బ్లాక్ బస్టర్ హిట్ కావడం జరిగింది. రెండు వారలు ఏకధాటిగా కలెక్షన్స్ కొల్లగొట్టిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఛాన్స్ ని మిస్ చేసుకుంది. ఓ పక్క అన్ సీజన్, మరోపక్క కరోనా తో భీష్మ బ్లాక్ బస్టర్ అవకుండానే ఆగిపోయింది. అయినప్పటికీ భీష్మ కొన్న బయ్యర్లు లాభాల బాటలో ఉన్నారు. అంత సవ్యంగా జరిగికి భీష్మ లాంగ్ రన్ కొచ్చిన తర్వాత ఇప్పుడు భీష్మ సినిమా విషయంలో కొంతమంది హెచ్ఆర్సీలో కంప్లైంట్ ఫైల్ చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. భీష్మ సినిమా పై గంగపుత్రుల అధ్యక్షుడు తెలంగాణ హెచ్ఆర్సీలో కంప్లైంట్ చేసాడు.

భీష్మ సినిమాలోని కొన్ని సన్నివేశాలు గంగపుత్రులను కించపరిచేలా ఉన్నాయని, ఆ సీన్స్ మా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా అభ్యంతరకరంగా ఉన్నాయని.. అలాంటి సన్నివేశాలను సినిమా నుండి నుంచి వెంటనే తొలిగించాలని కంప్లైంట్ చెయ్యడమే కాదు.. ఆఖరుకు డిజిటల్, శాటిలైట్ లలో కూడా ఆ సన్నివేశాలను తొలగించాకే ప్రసారం చెయ్యాలంటూ భీష్మ సినిమా పై వారు కంప్లైంట్ చెయ్యడం మాత్రం నిజంగా హాస్యాస్పదమే. ఎందుకంటే సినిమా విడుదలై దాదాపుగా 20 రోజులు కావొస్తున్నా ఈతరుణంలో వారు అలా భీష్మ సినిమాలో తమ గౌరవం దెబ్బతినే సన్నివేశాలను తొలగించాలంటూ మీడియా కెక్కడం మాత్రం నిజంగా షాకింగ్ విషయమే. అయితే ఈ పబ్లిసిటీతో భీష్మ కలెక్షన్స్ ఎమన్నా పెరుగుతాయేమో చూద్దాం.

Tags:    

Similar News