మహేశ్ బాబుని కలిసిన ముఖ్యమంత్రి..?

Update: 2018-06-18 09:44 GMT

భారత్ అనే నేను సినిమాలో ముఖ్యమంత్రి పాత్ర పోషించి సీఎం అంటే ఇలా ఉండాలి అనిపించాడు మహేశ్ బాబు. వంశీ పైడపల్లితో తన తర్వాతి చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ప్రస్థుతం ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. అయితే, మహేశ్ బాబు షూటింగ్ జరుగుతున్న సెట్ కు ఓ ప్రముఖ వ్యక్తి వచ్చి, మహేశ్ బాబుని కలిసి కాసేపు ముచ్చటించి వెళ్లారని తెలుస్తోంది. కలిసిన వ్యక్తి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ అని ఫిలింవర్గాల్లో టాక్ వినపడుతోంది. ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి మహేశ్ బాబుని కలిశారంట.

Similar News