'చిత్రలహరి' లో హీరోయిన్స్ వీరే..!

Update: 2018-11-03 06:40 GMT

సాయి ధరమ్ తేజ్ ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లు అయిపోతుంది. ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని ఏళ్లవుతున్నా తేజుకి చెప్పుకోడానికి ఒక్క హిట్ కూడా లేదు. 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' తప్ప. ఎప్పటికప్పుడు ప్రేక్షకులని ఎంటర్టైన్ చేద్దాం అని వచ్చినా అన్నీ బిడిసి కొడుతున్నాయి తేజుకి. ప్రస్తుతం తేజు 'చిత్రలహరి' అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం కోసం ఇద్దరు హీరోయిన్స్ అవసరం ఉంది. చిత్ర అనే పాత్ర కోసం 'హలో' మూవీ ఫేమ్ కళ్యాణి ప్రియదర్శిన్ ను తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక లహరి పాత్ర కోసం తాజాగా ఓ హీరోయిన్ ని ఫిక్స్ చేశారట మేకర్స్.

మోడ్రన్ అమ్మాయిలా...

ఆమె ఎవరో కాదు... 'మెంటల్ మదిలో', 'టిక్ టిక్ టిక్', 'రోషగాడు' సినిమాల్లో నటించిన నివేథా పేతురాజ్. ఈమె ఫోటోషూట్ మరియు గత సినిమాలు చూసి ఓకే చేసారని తెలుస్తుంది. ఇందులో నివేథా పేతురాజ్ ఈ సినిమాలో కాస్త మోడరన్ టచ్ ఉన్న అమ్మాయిగా కనిపిస్తుందని సమాచారం. మైత్రీ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం చేస్తున్నాడు. రీసెంట్ గా షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Similar News