చిరు పారితోషికం వింటే షాకవ్వాల్సిందే!!

రాజకీయాలపై మోజుతో తొమ్మిదేళ్లు సినిమాలు వదిలేసినా.. చిరు క్రేజ్ సినిమాల్లో ఏ మాత్రం తగ్గలేదు. అందుకే రామ్ చరణ్ తండ్రి క్రేజ్ క్యాష్ చేసుకోవడానికి కొణిదెల ప్రొడక్షన్స్ [more]

Update: 2020-11-17 17:15 GMT

రాజకీయాలపై మోజుతో తొమ్మిదేళ్లు సినిమాలు వదిలేసినా.. చిరు క్రేజ్ సినిమాల్లో ఏ మాత్రం తగ్గలేదు. అందుకే రామ్ చరణ్ తండ్రి క్రేజ్ క్యాష్ చేసుకోవడానికి కొణిదెల ప్రొడక్షన్స్ పెట్టి తండ్రి సినిమాలను నిర్మాణం చేస్తున్నాడు. అయితే ఆచార్య సినిమాకి మరో నిర్మాత నిరంజన్ రెడ్డితో కలిసి నిర్మాణం చేపట్టిన రామ్ చరణ్ తదుపరి చిరు చిత్రాలను వేరే నిర్మాతలకు వదిలిపెట్టాడు. ఆచార్య తర్వాత చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్ చేసే ప్లాన్ లో ఉన్నాడు. ఇంకా ప్రకటన రాలేదు కానీ… ఇప్పుడు వేదలమ్ రీమేక్ కి చిరు తీసుకునే పారితోషికంపై ఫిలిం ఇండస్ట్రీలో హాట్ హాట్ చర్చలు మొదలయ్యాయి.

మెహర్ రమేష్ దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మాణంలో తెరకెక్కబోయే వేదాళం రీమేక్ కి చిరు పారితోషకం ఫిక్స్ అయ్యింది అని.. అది కూడా ఓ రేంజ్ పారితోషికం అనే ప్రచారం జరుగుతుంది. ఆచార్య కోసం 50 కోట్లు అందుకుంటున్న చిరంజీవి.. వేదాళం రీమేక్ కి మరో పది కోట్లు ఎక్స్ట్రా అంటే.. 60 కోట్ల పారితోషికం అందుకోబోతున్నాడని.. ఇప్పటికే అగ్రిమెంట్లు కూడా పూర్తయ్యాయంటూ ఓ న్యూస్ ఫిలింసర్కిల్స్ లో చర్చలకు తెర లేపింది. మరి చిరు పారితోషికం 60 కోట్లు అంటే.. ఆ సినిమా బడ్జెట్ రేంజ్ ఎంత ఉండాలి.

Tags:    

Similar News