చిరు నెక్స్ట్ డైరెక్టర్ ఆయనా?

Update: 2018-04-13 06:00 GMT

మెగా స్టార్ చిరంజీవి పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో కనిపించబోతున్న చిత్రం సైరా. ఈ సినిమా షూటింగ్ లో చిరంజీవి బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సురేంద్ర రెడ్డి భారీ లెవెల్ లో రూపొందిస్తున్నాడు. అయితే ఈ సినిమా ఇంకా ఓ కొలిక్కి రాకముందే ఇప్పుడు మెగాస్టార్ నటించబోయే తర్వాతి సినిమా గురించి రకరకాల టాక్స్ వినిపిస్తున్నాయి.

తర్వాత ఆ సంస్థతోనే.....

సైరా సినిమాను రామ్ చరణ్ దాదాపు 150 నుంచి 200 కోట్ల దాకా బడ్జెట్ అవుతుందని అంచనా వేసాడు. ఈ సినిమా తర్వాత చిరంజీవి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ సంస్థ సుడి మాములుగా లేదు. ఏ సినిమా చేసినా హిట్ అవుతున్నాయి. శ్రీమంతుడు’- ‘జనతా గ్యారేజ్’- ‘రంగస్థలం లాంటి సక్సెస్ సినిమాలు తీసి సక్సెస్ అయ్యారు. శ్రీమంతుడు సినిమా మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిస్తే..జనతా గ్యారేజ్ సినిమా కూడా ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ మూవీగా నిలిచింది. ఇక లేటెస్ట్ గా వచ్చిన రామ్ చరణ్ రంగస్థలం సినిమా రామ్ చరణ్ అన్ని సినిమాలని క్రాస్ చేసి అలానే శ్రీమంతుడు సినిమాను కూడా క్రాస్ చేసి కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది.

సుకుమార్ ఒప్పుకోలేదా?

రంగస్థలం షూటింగ్ టైంలో మైత్రీ మూవీ మేకర్స్ పనితీరు పట్ల చాలా సౌకర్యంగా ఫీలయ్యిన చెర్రీ... తండ్రికి ఆ విషయం చెప్పి తర్వాతి సినిమా ఈ బ్యానర్లోనే చేయాలని చెప్పాడని సమాచారం. దీనికి సుకుమార్ దర్శకత్వం చేయబోతున్నాడని సమాచారం. కానీ సుక్కు మాత్రం చిరుతో సినిమా చెయ్యట్లేదు అని చెప్పేశాడు. కానీ చిరంజీవి సుకుమార్ తో సినిమా చేయాలనుకుంటున్నాడని ఫిలింనగర్ టాక్. త్వరలోనే ఈ సినిమా డీటెయిల్స్ ప్రకటించే అవకాశం ఉందని వినికిడి.

Similar News