మెహెర్ తో చిరు.. బాబోయ్ అంటున్న మెగా ఫాన్స్!!

చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు. కారోనా తో ఆచార్య షూటింగ్ ఆగడంతో.. ప్రస్తుతం చిరంజీవి ప్లాప్ దర్శకులు తెచ్చిన కథలు వింటున్నాడు. కథ [more]

Update: 2020-08-09 06:21 GMT

చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు. కారోనా తో ఆచార్య షూటింగ్ ఆగడంతో.. ప్రస్తుతం చిరంజీవి ప్లాప్ దర్శకులు తెచ్చిన కథలు వింటున్నాడు. కథ నచ్చితే యంగ్ అండ్ ప్లాప్ దర్శకులతో అయినా పనిచేస్తా అని చిరు చెప్పడంతో చిరు ని హీరోగా పెట్టుకుని దర్శకుడు బాబీ, మెహెర్ రమేష్ లాంటి  వాళ్ళు కథలు రాసారు. అయితే చిరు మలయాళ లూసిఫెర్ రీమేక్ ని పక్కనబెట్టి.. దర్శకుడు బాబీ చెప్పిన కథకి ఇంప్రెస్స్ అవడమే కాదు… ఆ సినిమాని ఆచార్య తర్వాత చేయబోతున్నాడని ప్రచారం జరిగింది. లూసిఫెర్ వదిలేసిన చిరు బాబీ తో సినిమానా అన్నారు మెగా ఫాన్స్.

అయితే అదంతా ఒక ఎత్తైతే ఇప్పడు చిరంజీవి మెహెర్ రమేష్ తో సినిమా చెయ్యబోతున్నట్టుగా సోషల్ మీడియా టాక్. శక్తి,, షాడో సినిమాల అట్టర్ ప్లాప్స్ తర్వాత మెహెర్ రమేష్ కొన్ని ఏళ్లుగా సినిమాల దర్శకత్వానికి బ్రేకిచ్చేసాడు. అలాంటిది మెహెర్ రమేష్ తో చిరు సినిమా అంటూ మెగా ఫాన్స్ లో కంగారు పుడుతుంది. అయితే మెహెర్ రమేష్ రీమేక్స్ ని పర్ఫెక్ట్ గా చేస్తాడని నమ్మి చిరు రమేష్ ని పిలిచి తమిళ వేదాళం ని రీమేక్ చెయ్యమని చెప్పినట్లుగా వార్తలొస్తున్నాయి. అజిత్ నటించిన వేదాళం మూవీ అక్కడ సూపర్ హిట్. అదే సినిమాని తెలుగులో చిరు మెహెర్ రమేష్ దర్శకత్వంలో రీమేక్ చెయ్యాలని అనుకుంటున్నాడట. ఈ సినిమాని కె ఎస్ రామ రావు కానీ, లేదంటే కొణిదెల ప్రొడక్షన్ లోనే రీమేక్ చేస్తారని వినికిడి. కానీ మెగా ఫాన్స్ మాత్రం మెహెర్ తో సినిమా ఏంటన్నయ్యా… మీరు కూడా ఎలా చేస్తే ఎలా అంటూ తెగ ఫీలవుతున్నారట.

Tags:    

Similar News