చిరుగారి చేపల వేపుడు!!

మెగాస్టార్ చిరు కరోనా లాక్ డౌన్ లో ఆయనగారికున్న వ్యాపకాలన్నీ బయటికి తీస్తున్నాడు. షూటింగ్స్ కి అనుమతుల కోసం ప్రభుత్వాల చుట్టూ తిరిగి అనుమతులొచ్చాక సైలెంట్ గా [more]

Update: 2020-08-11 05:27 GMT

మెగాస్టార్ చిరు కరోనా లాక్ డౌన్ లో ఆయనగారికున్న వ్యాపకాలన్నీ బయటికి తీస్తున్నాడు. షూటింగ్స్ కి అనుమతుల కోసం ప్రభుత్వాల చుట్టూ తిరిగి అనుమతులొచ్చాక సైలెంట్ గా ఇంట్లోనే ఉంటున్న చిరు మధ్య మధ్యలో ఇండస్ట్రీ వ్యక్తులను తన ఇంట్లోనే కలుస్తున్నాడు. తాజాగా ప్లాస్మా డొనేషన్ మీద అవగాహన కలిగించడానికి పోలీస్ లతో కలిసి అవగాహనా కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఇక బీ ద రియల్ మ్యాన్ ఛాలెంజ్ లో భాగంగా తన తల్లికి పెసరట్టు ఉప్మా వేసి తినిపించడమే కాదు.. ఇంటిని కూడా క్లీన్ చేసాడు. అలాగే తోట పని అది ఇది అంటూ చిరు కరోనా లాక్ డౌన్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.

ఇక తాజాగా చిరు అమ్మ కోసం అమ్మ నేర్పిన వంట అంటూ చేపల కూర ఫ్రై చేసిన వీడియో ఒకటి సోషల్ ఇండియాలో షేర్ చేసాడు చిరు. చిరు కి వంట బాగా తెలుసట. అయితే అన్ని వంటల్లోకెల్లా చిరు కి సీ ఫుడ్ అంటే చాలా ఇష్టమట. ఆ సీ ఫాడ్ లోను చేపల వేపుడు అంటే మరీ ఎక్కువ ఇష్టమట. అందుకే ఈ లాక్ డౌన్ లో ఆయన చింత తొక్కుతో చిన్న చేపల గుజ్జు ఏపుడు చేసి ఆ వీడియో ని షేర్ చేసాడు. మరి చిరు చేసిన చింత తొక్కుతో చిన్న చేపల గుజ్జు ఏపుడు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. లాక్ డౌన్ లో జిమ్ చెయ్యడమే కాదు.. ఇలాంటి రకరకాల వంటలను ట్రై చేస్తూ చిరు బిజీ బిజీగా ఉన్నాడు. కాకపోతే ఆచార్య షూటింగ్ ఎప్పుడు అనేది మాత్రం క్లారిటీ ఇవ్వకుండా మెగా ఫాన్స్ ని సూపెన్స్ లో పెడుతున్నాడు అంతే. 

Tags:    

Similar News