సైరా కు బ్రేక్ పడింది

మెగా స్టార్ చిరంజీవి – సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో భారీ లెవెల్ లో తీర్చిద్దితున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గాథ ఆధారంగా తెరకెక్కుతున్న [more]

Update: 2019-02-25 05:02 GMT

మెగా స్టార్ చిరంజీవి – సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో భారీ లెవెల్ లో తీర్చిద్దితున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గాథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈచిత్రం కు బ్రేక్ పడింది. బీదర్ లో వారం రోజులు పాటు షూట్ చేయడం కోసం అన్ని పర్మిషన్లు, అంత సెట్ చేసుకుని వెళ్తే బ్రేక్ పడింది.

వివరాల్లో కి వెళ్తే షూటింగ్ కోసం సైరా టీం బీదర్ కు వెళ్ళింది. అక్కడ కత్తులు, తలపాగాలు, గెడ్డాలు, గెటప్ లు ఇవన్నీ చూసిన తరువాత కొంతమంది లోకల్స్ అభ్యంతరం చెప్పారట. అన్ని పర్మిషన్లు ఉన్నాయి అని చెప్పినా ఒప్పుకోలేదట. లోకల్స్ ని కాదనుకుని చేసేది ఏమి లేక టీం వెనక్కు వచ్చేసింది.

ఇక హైదరాబాద్ కోకాపేట్ లో వేసిన భారీకోట సెట్ లో షూట్ చేసుకోవాలని డిసైడ్ అయిపోయారు. రోజులు గడిచే కొద్దీ సినిమా వెనక్కి వెళ్తూనే ఉంది. ఇప్పటివరకు సినిమా రిలీజ్ పై క్లారిటీ ఇవ్వలేదు రామ్ చరణ్. చిరు కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా చరణ్ ఈసినిమాను 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు.

Tags:    

Similar News