సరిలేరు నీకెవ్వరూ ఈవెంట్ కి అదే హైలెట్

మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరూ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా ఫ్యాన్స్ కోలాహలం మధ్యన జరిగింది. మహేష్ ఫ్యాన్స్, [more]

Update: 2020-01-06 06:40 GMT

మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరూ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా ఫ్యాన్స్ కోలాహలం మధ్యన జరిగింది. మహేష్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ సందడి ఓ రేంజ్ లో స్టేడియం లో కనబడింది. ఇక ఈ వేడుక కి లేడి అమితాబ్ విజయశాంతి, అతిధిగా వచ్చిన మెగా స్టార్ చిరు, సూపర్ స్టార్ మహేష్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. మహేష్ బాబు క్యూట్ గా హ్యాండ్ సమ్ గా కనబడితే.. చిరు గంభీరంగా సరదాగా కనిపించాడు. ఇక విజయశాంతి ఎప్పటిలాగే లేడి అమితాబ్ లా సూపర్ లుక్ లో కనబడింది. ఇక రష్మిక సిల్లీగా, తమన్నా హిట్ డాన్స్ తో అదరగొట్టేసాడు. ఇక ఈ వేడుక ముఖ్యమైన హైలెట్ ఏమిటి అంటే చిరు – విజయశాంతి 15 ఏళ్ళ తర్వాత కలవడం.. మట్లాడుకోవడం.

ముందులో విజయశాంతి – చిరు మధ్యలో మహేష్ కూర్చునేసరికి చిరుకి విజయశాంతికి మట్లాడుకోవడానికి అవకాశం దొరకలేదు. జస్ట్ హాయ్ అంటే హాయ్ అన్న రేంజ్ లోనే ఉన్నారు. తర్వాత మహేష్ లేవగానే చిరు – విజయశాంతి లు ఒకే సోఫాలో ఏకధాటిగా మట్లాడుకుంటూనే ఉన్నారు. ఇక స్టేజ్ మీద విజయ్ శాంతి తో తాను 20 సినిమా లు చేశానని.. అప్పటినుండి ఇప్పటికి ఆమె నా స్నేహితురాలు అంటూ చిరు మాట్లాడడం, విజయశాంతి కాస్త ఎమోషనల్ అయినా ఇంతమంచి స్నేహితుడు మీద రాజకీయంగా ఎలా పంచ్ లు వెయ్యాలనిపించింది అంటూ చిరు విజయశాంతిని అల్లరి పట్టించడం, విజయశాంతి కాస్త నెర్వేస్ గా ఫీల్ అవడం… తర్వాత కూల్ అయ్యి ఎప్పటికి మీరు నా మనసుకు స్నేహితుడే అనగానే చిరు ఆప్యాయంగా విజయశాంతిని హాగ్ చేసుకోవడం అబ్బో చూడడానికి రెండు కళ్ళు కాదు నాలుగు కళ్లు అవసరమయ్యాయి. ఇక మధ్యలో మహేష్ తో చిరు – విజయశాంతి ఫొటోస్ కి ఫోజులివ్వడం ఇదంతా సరిలేరు నీకెవ్వరూ ఈవెంట్ కి స్పెషల్ హైలెట్ గా నిలిచింది

Tags:    

Similar News