‘సైరా’లో వారి సీన్స్ హైలెట్ అంట..!

సురేందర్ రెడ్డి – చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సైరా చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఖైదీ నెంబర్ 150 తరువాత వస్తున్న చిత్రం కాబట్టి [more]

Update: 2019-02-05 10:06 GMT

సురేందర్ రెడ్డి – చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సైరా చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఖైదీ నెంబర్ 150 తరువాత వస్తున్న చిత్రం కాబట్టి మేకర్స్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవితో పాటు చాలామంది స్టార్స్ నటిస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి సరసన నయనతార నటిస్తుంటే.. ప్రముఖ పాత్రల్లో త‌మ‌న్నా, అమితాబ్‌ బ‌చ్చ‌న్‌, విజ‌య్‌ సేతుప‌తి, జ‌గ‌ప‌తి బాబు, సుదీప్ నటిస్తున్నారు. చిరంజీవి తరువాత అంతటి ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర ఏమైనా ఉందంటే అది సుదీప్ దే అని చెబుతున్నారు. అతను ఇందులో శ‌క్తిమంత‌మైన పాత్ర‌లో కనిపించనున్నాడని.. అతని నటన ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌బోతోంద‌ని స‌మాచారం అందుతోంది.

సుదీప్ కి మంచి మార్కెట్ ఉండటంతో…

తెలుగులో రాజమౌళి తీసిన ‘ఈగ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సుదీప్ ఆ తరువాత తెలుగులో చాలా ఆఫర్స్ వచ్చినా అవేమీ ఒప్పుకోలేదు. కానీ ‘సైరా’ మాత్రం ఒప్పుకున్నాడు. చిరంజీవి – సుదీప్ మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయ‌ని తెలుస్తోంది. కన్నడలో సుదీప్ కి మంచి మార్కెట్ ఉంది. దీన్ని బేస్ చేసుకుని ‘సైరా’ను అక్కడ కూడా విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఇప్పటి వరకు ఓ క్లారిటీ కూడా లేదు. తాజా సమాచారం ప్రకారం ఇది వచ్చే ఏడాది అంటే 2020లో రిలీజ్ అయ్యే అవకాశముందని తెలుస్తుంది.

Tags:    

Similar News