అఖిల్ తో చిరంజీవి డైరెక్టర్..!

Update: 2018-11-27 08:09 GMT

చిరంజీవి రీఎంట్రీ ఇచ్చిన ఖైదీ నంబర్ 150తో తన సొంత బ్యానర్ ను లాంచ్ చేశాడు రామ్ చరణ్. ఇప్పుడు చిరంజీవి 152వ చిత్రం 'సైరా' కూడా కొణిదెల ప్రొడక్షన్స్ లో నిర్మిస్తున్నారు రామ్ చరణ్. ఇదిలా ఉండగా రామ్ చరణ్ - అఖిల్ అక్కినేని మంచి ఫ్రెండ్స్ అని అందరికీ తెలిసిన విషయమే. వీరిద్దరూ కలిసి బయట ఒకరి ఈవెంట్ కు ఇంకొకరు వెళ్తుంటారు. ఫ్రెండ్ షిప్ ని యూజ్ చేసుకుని చరణ్ అఖిల్ తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాను తన సొంత బ్యానర్ అయిన కొణిదెల ప్రొడక్షన్స్ లోనే నిర్మించనున్నాడు. అన్ని అనుకున్నట్టు జరిగితే సురేందర్ రెడ్డి డైరక్షన్ లో ఈ సినిమా ఉంటుంది. ఆల్రెడీ సురేందర్ రెడ్డి అఖిల్ కి ఓ లైన్ చెబితే ఆ లైన్ కి వెంటనే కనెక్ట్ అయ్యిపోయాడంట.

సైరా తర్వాత అఖిల్ తో...

ప్రస్తుతం 'సైరా' షూటింగ్ లో బిజీగా ఉన్న సురేందర్ రెడ్డి ఈ సినిమా కంప్లీట్ చేసిన తరువాత వెంటనే అఖిల్ మూవీని సెట్స్ మీదకు తీసుకుని వెళ్లనున్నాడు. అఖిల్ ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'మిస్టర్ మజ్ను' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే షూటింగ్ కంప్లీట్ చేసుకోనుంది. ఈ సినిమా తరువాత అఖిల్ వెంటనే ఆది పినిశెట్టి తమ్ముడి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత సురేందర్ రెడ్డితో డైరెక్షన్ లో నటించే అవకాశముంది.

Similar News