చిరు 'ఎన్టీఆర్' ఫంక్షన్ కి రాకపోవడానికి కారణం అదే

Update: 2018-12-23 04:04 GMT

నేను హైదరాబాద్ లో పెద్దగా ఎవరిని కలవను. నా షూటింగ్స్ తో నాకు సరిపోతుంది. షూటింగ్స్ లేకపోతే కాన్సర్ హాస్పిటల్ కి వెళ్లి అక్కడ పనులు చూసుకుంటా..లేదా నా నియోజకవర్గం కి వెళ్లి నా ప్రజలకు అందుబాటులో ఉంటా అని నందమూరి బాలకృష్ణ చాలా సార్లు చెప్పాడు. ఇండస్ట్రీ లో మీరు ఎక్కువ క్లోజ్ గా ఉండేది ఎవరితో అంటే.."నేను చిరంజీవి తో ఎక్కువ క్లోజ్ గా ఉంటాను" అని బాలయ్య చాలా సందర్భాల్లో చెప్పాడు.

ఆ మాట అన్న తరువాత నందమూరి - మెగా ఫ్యామిలి ఒక్కటే అని అభిమానులు కూడా ఆనంద పడ్డారు. కానీ మొన్న జరిగిన 'ఎన్టీఆర్' బయోపిక్ ఆడియో ఈవెంట్ కి చిరంజీవి రాలేదు. ఇండస్ట్రీ నుండి చాలామంది సీనియర్ హీరోస్..డైరెక్టర్స్ వచ్చారు కానీ చిరు రాకపోవడంతో వీరిద్దరి మధ్య ఏమైనా గొడవలు జరిగాయా? అన్న అనుమానాలు వ్యక్తం చేసారు ఫ్యాన్స్. రీసెంట్ గా నాగబాబు బాలకృష్ణ ఎవరో నాకు తెలియదు అనడంతో బాలయ్య చిరు ని ఈ ఫంక్షన్ పిలిచి ఉండడు అని అనుకున్నారు అంత.

అయితే వీరిద్దరూ కలిసే ఉన్నారని..ఇద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేవని ఇదే ఉదాహరణ. 'ఎన్టీఆర్‌' బయోపిక్ ఆడియో శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో ఘ‌నంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కు కృష్ణ‌, కృష్ణంరాజు, మోహన్ బాబు లాంటి సీనియర్ హీరోస్ అంత వచ్చారు. అయితే బాలయ్య చిరు కి కూడా ఫోన్ చేసి 'ఆడియో ఫంక్ష‌న్‌కి రావాలి' అని చెప్పాడట. కానీ చిరు ఆ స‌మ‌యానికి హైద‌రాబాద్‌లో లేరు. 'సైరా' షూటింగ్ నిమిత్తం బిజీగా ఉండడంతో నేను రాలేనని చెప్పాడట. ఒకవేళ చిరు హైదరాబాద్ లో ఉండి ఉంటె కచ్చితంగా ఈ ఈవెంట్ కు అటెండ్ అయ్యేవారని చెబుతున్నారు. సో మరోసారి వీరిద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ అలానే ఉందని రుజువైంది.

Similar News