‘చిత్రలహరి’పై చిరు ప్రశంసలు

సుప్రీమ్ హీరో సాయి తేజ్ హీరోగా మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన చిత్రం `చిత్ర‌ల‌హ‌రి`. ఏప్రిల్ 12న విడుద‌లై హిట్ టాక్‌తో [more]

Update: 2019-04-15 10:47 GMT

సుప్రీమ్ హీరో సాయి తేజ్ హీరోగా మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన చిత్రం 'చిత్ర‌ల‌హ‌రి'. ఏప్రిల్ 12న విడుద‌లై హిట్ టాక్‌తో స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది. కాగా, ఈ సినిమా యూనిట్‌ను మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. సినిమా వీక్షించిన ఆయన ఈ సినిమా ప్రతీ ఒక్కరు చూడదగిందని ప్రశంసించారు. చిరంజీవి మాట్లాడుతూ – “కిషోర్ తిరుమ‌ల 'చిత్ర‌ల‌హ‌రి' చిత్రాన్ని సెటిల్డ్ మెసేజ్‌తో చాలా చ‌క్క‌గా తెర‌కెక్కించాడు. ద‌ర్శ‌కుడిగా త‌న ప్ర‌తిభను నిరూపించుకున్నారు. ఇక తేజు కూడా న‌టుడిగా త‌న ప్ర‌తిభ‌ను నిరూపించుకున్నాడు. పరిణితి సాధించిన న‌టుడిగా నిరూపించుకున్నాడు. బంధాలు, అనుబంధాల గురించి ముఖ్యంగా తండ్రి కొడుకు మ‌ధ్య అనుబంధం గురించి చ‌క్క‌గా చెప్పారు. ఎలాంటి ఒడుదొడుకులు వ‌చ్చినా మ‌నం అనుకున్న ల‌క్ష్యం సాధించ‌డానికి కృషితో ముందుకు వెళ్లాల‌ని చెప్పిన చిత్రం ఇది’’ అని పేర్కొన్నారు. సినిమా స‌క్సెస్ అయిన సంద‌ర్భంగా చిత్ర యూనిట్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

Tags:    

Similar News