ఒకే వేదిక పై కలవబోతున్న బాలయ్య, చిరు

టాలీవుడ్ సీనియర్ హీరోలు నందమూరి నటసింహం బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి.. ఉప్పు, నిప్పులా వున్న ఈ [more]

Update: 2019-01-16 05:32 GMT

టాలీవుడ్ సీనియర్ హీరోలు నందమూరి నటసింహం బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి.. ఉప్పు, నిప్పులా వున్న ఈ ఇద్దరు ఇప్పుడు ఒకే వేదిక పై కనిపించబోతున్నారు..వీరితో పాటు విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున వేదిక పంచుకోనున్నారు.ఇక వీరితో పాటు కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ వేదికపైన కనిపిస్తే ఆ కిక్కే వేరప్పా. కోలీవుడ్ స్టార్ హీరోలు విక్రమ్, సూర్య కూడా ఈ వేదికపైన కనిపిస్తే మాములుగా ఉండదు. రచ్చరచ్చే. ఇంతకీ ఈ హీరోలందరినీ ఒకే వేదికపైకి తీసుకు వస్తున్నది ఎవరో తెలుసా… కళాబంధు టి.సుబ్బరామి రెడ్డి.

వైజాగ్ లో టి ఎస్ ఆర్ నేషనల్ అవార్డ్స్ వేడుకను ఫిబ్రవరి 17న అంగరంగ వైభవంగా జరపడానికి సుబ్బరామి రెడ్డి సన్నాహాలు చేస్తున్నారు. ఈ వేడుకకు తెలుగు చిత్రపరిశ్రమ ప్రముఖులు, రాజకీయనాయకులతో పాటు కోలీవుడ్, బాలీవుడ్, మల్లూవుడ్, శాండిల్ వుడ్ కి చెందిన ప్రముఖులు పాలుపంచుకోబోతున్నారు. ఈ అవార్డ్ వేడుక జరగబోతున్న వేదికపైన టాలీవుడ్ సీనియర్ హీరోలు చిరు, బాలయ్య, నాగ్, వెంకీ లు అలరించనున్నారు. ‘ఎన్టీఆర్ – కథానాయకుడు’ లో ఎన్టీఆర్ సతీమణి బసవ తారకం పాత్ర పోషించిన విద్యాబాలన్ ను శ్రీదేవి మెమోరియల్ అవార్డ్ తో సత్కరించనున్నారు. అయితే ఇప్పుడు బాలయ్య, చిరు వస్తారా లేదా అనేది చూడాలి.

Tags:    

Similar News