"చి ల సౌ" రిలీజ్ డేట్ ఫిక్స్!

Update: 2018-07-10 06:40 GMT

సుశాంత్ నటించిన 'చి ల సౌ' సినిమా జులై 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో హీరో రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారారు. రుహాని శర్మ హీరోయిన్ గా పరిచయం కాబోతోంది. చి ల సౌ సినిమా కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్, సిరుని సినీ కార్పొరేషన్ తో అనుబంధం ఏర్పరుచుకుంది. అన్నపూర్ణ సంస్థ ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యనుంది.

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో..

ఇటీవల విడుదలైన చి ల సౌ చిత్ర టీజర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ప్రశాంత్ విహారి ఈ చిత్రానికి సంగీతం అందించారు. సుశాంత్, రుహాని శర్మ, వెన్నెల కిషోర్, జయ ప్రకాష్, సంజయ్ స్వరూప్, రోహిణి, అను హాసన్, రాహుల్ రామకృష్ణ, విద్యు రామన్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.

Similar News