పూరి ని నమ్మింది.. గట్టెక్కింది

హీరోయిన్ గా తెరమరుగైన తర్వాత దర్శకుడు పూరి జగన్నాధ్ చెంతకు చేరింది హీరోయిన్ ఛార్మి కౌర్. ఒకప్పుడు హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఛార్మి మ్యూజిక్ [more]

Update: 2019-07-22 07:46 GMT

హీరోయిన్ గా తెరమరుగైన తర్వాత దర్శకుడు పూరి జగన్నాధ్ చెంతకు చేరింది హీరోయిన్ ఛార్మి కౌర్. ఒకప్పుడు హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఛార్మి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తో ప్రేమాయణం నడిపింది. ఇక హీరోయిన్ గా అవకాశాలు చేజారిన తర్వాత ఛార్మి పూరీనే నమ్ముకుని అతని నిర్మాణ సంస్థలో భాగస్వామిగా మారింది. ఇక ఛార్మి – పూరి లపై పెద్ద ఎత్తున గాసిప్స్ వచ్చినా వెరవని ఛార్మి.. పూరీనే నమ్ముకుని అతని చెంతనే ఉండిపోయింది. ఇక పూరి తో చేరిన ఛార్మి తాను కష్టపడి సంపాదించిన సొమ్ముని పూరి చేస్తున్న సినిమాలపై పెట్టింది. పూరి కనెక్ట్స్ పేరుతొ పూరి – ఛార్మి లు సినిమాలు నిర్మించారు. ఇక ఛార్మి పూరి కనెక్ట్స్ బాగోగులు చూసుకోవడమే కాదు.. పూరి తీసే ప్రతి సినిమా స్టార్ కాస్ట్ విషయంలో శ్రద్ద పెట్టేది. కానీ పూరి – ఛార్మీల కాంబో ఎప్పటికప్పుడు ఫెయిల్ అవుతూనే అవచ్చింది. అయినా పూరి స్నేహాన్ని ఛార్మి విడవలేదు.

అందుకే ఇప్పుడు పూరి ని నమ్మినందుకు ఛార్మి గట్టున పడింది. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో నిర్మాతగా పూరితో కలిసి ఛార్మి లాభాలు పంచుకుంది. రామ్ తో చేసిన ఈ సినిమా గత గురువారమే విడుదలై ఫస్ వీకెండ్ లోనే 37 కోట్ల గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా కొల్లగొట్టింది. ఈ సినిమా విజయంలో ఛార్మి పాత్ర ముఖ్యమైనది. ప్రమోషన్స్ లోను, సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళడంలోనూ ఛార్మి ముఖ్య పాత్ర పోషించింది. పూరి దర్శకత్వ బాధ్యతలకు పరిమితమైతే ఛార్మి నిర్మాణ పనులను చాక చక్యంగా నిర్వహించింది. ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ కి యావరేజ్ టాక్ పడినా.. ఆ సినిమా కలెక్షన్స్ ఆ రేంజ్లో రావడం వెనుక ఛార్మి ఉంది అనేది సత్యం. ఇక ప్రస్తుతం వస్తున్న కలెక్షన్స్ చూసిన ఛార్మి ఓ రేంజ్ లో ఆనందాన్ని ఆనుభవిస్తుంది. మరి పూరి దగ్గర ఉన్నప్పటికీ.. చాలా సినిమాలు పోయినా.. ఛార్మికి ఈసినిమా హిట్ భారీ రిలీఫ్ ఇచ్చింది. అందుకే పూరి ని నమ్మి ఛార్మి ఈరోజు ఈ హిట్ లో భాగస్వామి అయ్యింది.

Tags:    

Similar News