ఈ టైం లో ఇది అవసరమా?

కరోనా తో ఖాళీగా ఉన్న హీరో హీరోయిన్స్ జిమ్స్, వంటలు ట్రై చెయ్యడం వంటి వాటితో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నారు. హీరోయిన్స్ అయితే జిమ్ అంటూ [more]

Update: 2020-04-12 07:55 GMT

కరోనా తో ఖాళీగా ఉన్న హీరో హీరోయిన్స్ జిమ్స్, వంటలు ట్రై చెయ్యడం వంటి వాటితో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నారు. హీరోయిన్స్ అయితే జిమ్ అంటూ ఇంట్లోనే వర్కౌట్స్ చేస్తూ ఆ వీడియోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటే హీరోస్ వంటలు ట్రై చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇక హీరోయిన్స్ కొంతమంతి కొత్త కొత్త వంటలు రెడీ చేస్తున్నారు. అందులో భాగముగా ఓ బాలీవుడ్ హీరోయిన్ చాకోలెట్ కేక్ చేస్తుండగా చాకోలెట్స్ అయ్యిపోయాయట. దానితో తాను అడగగానే ఫార్చ్యూన్ గార్మెంట్స్ ఇండియా సంస్థ వారు తనకి చాకోలెట్ పంపారని గొప్పగా ట్వీట్ చెయ్యగా.. దానికి తెలుగు యాంకర్ ఒకరు బాగా ఫైర్ అయ్యారు.

బాలీవుడ్ లో మోస్ట్ స్టైలిష్ హీరోయిన్ అయినా సోనమ్ కపూర్ కరోనా టైం లో ఇంట్లోనే ఉంటూ భర్తకి రకరకాల వంటలు చేస్తూ తాజాగా చాకోలెట్ కేక్ తయారీ కోసం అన్ని రెడీ చెయ్యగా చాకోలెట్ అయ్యిపోవడంతో ఆమె ఫార్చ్యూన్ గార్మెంట్స్ ఇండియా సంస్థ వారిని అడగగా.. వెంటనే వారు సోనమ్ కపూర్ కి చాకోలెట్ పంపారట. ఈ విషయాన్నీ సోనమ్ సోషల్ మీడియాలో షెర్ చేసింది. దానితో చిర్రెత్తుకొచ్చిన తెలుగు హాట్ యాంకర్ రష్మీ ఈ టైం లో ఇలాంటివి అవసరమా అంటూ ఫైర్ అయ్యింది. ఫార్చ్యూన్ గార్మెంట్స్ ఇండియా.. మీరు ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో.. ఆమె బేకింగ్ కి కావల్సిన వస్తువులు అందించడం అంత అవసరమా.. మీరు ఆమెకి చాకోలెట్స్ అందించే క్రమంలో మీరు మీ ఉద్యోగులు ప్రాణాలను రిస్క్ లో పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది రష్మీ.

Tags:    

Similar News