ఆ సినిమా సెట్ అవడంలో ఛార్మి దే కీలక పాత్ర..?

Update: 2018-05-23 08:08 GMT

గత రెండు రోజులుగా ‘ఫ్లాప్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో నాగ్ సినిమా’ అనే న్యూస్ సోషల్ మీడియాలో మామూలుగా చక్కర్లు కొట్టడం లేదు. అయితే మెహబూబా సినిమాతో పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిన పూరి జగన్నాధ్ కి నాగార్జున ఆఫర్ ఇవ్వడం పెద్ద విషయమే. ప్రస్తుతం నాగార్జున అందరినీ కాదని రామ్ గోపాల్ వర్మ కి ఆఫీసర్ అవకాశం ఇవ్వడమే పెద్ద విశేషం. ఇక ఇప్పుడు పూరి కి అవకాశం ఇచ్చి అందరిని ఆశ్చర్యంలో పడేసాడు. అయితే నాగార్జున, పూరి జగన్నాధ్ లు గతంలోనూ రెండు సినిమా లకు కలిసి పని చేశారు. కానీ ఇప్పుడు ఘోరమైన ఫ్లాప్స్ లో ఉన్న పూరికి నాగ్ అవకాశం ఇవ్వడమే అర్ధం కానీ విషయం.

నష్టాలు పూడ్చుకునే పనిలో...

అయితే నాగార్జున కి పూరి జగన్నాధ్ ల మధ్యన ఇలా సినిమా డీల్ సెట్ కావడానికి హీరోయిన్ ఛార్మి కారణమంటున్నారు. పూరి జగన్నాధ్ స్థాపించిన పూరి క‌నెక్ట్స్ సంస్థకు సీఈవోగా కీల‌క బాధ్య‌త‌లు నెర‌వేరుస్తున్న ఛార్మి, ప్ర‌స్తుతం త‌న సంస్థ ను నష్టాల్లో నుండి బయట పడేయడానికి కంకణం కట్టుకుంది. మెహబాబా సినిమాని ఛార్మి నాలుగు కోట్లతో, పూరి జగన్నాధ్ ఎనిమిది కోట్లతో కలిసి పూరి కనేక్ట్స్ మీద నిర్మించారు. ఇక మెహబూబా సినిమా భారీ లాస్ తో ఛార్మి, పూరి భారీగా నష్టపోయారు. అయితే ఇప్పుడు ఆ నష్టాలను పూడ్చుకోవడానికి ఛార్మి, పూరి కష్టపడుతున్నారు. ఛార్మి అందులో డబ్బు పోగొట్టుకున్నప్పటికీ పూరి మీదున్న నమ్మకం మాత్రం ఏ మాత్రం పోలేదట.

చక్కబెట్టిన ఛార్మి...

ఆ నమ్మకంతోనే నాగార్జున తో పూరి సినిమా విషయంలో ఛార్మి చాకచక్యంగా వ్యవహరించి నాగార్జున తో మంత‌నాలు సాగించి పూరితో ప్రాజెక్టును ఫైన‌ల్ చేయించిందనే టాక్ ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి పూరి విషయంలో ఛార్మికి ఉన్న నమ్మకం ఏమిటనేది ఈ డీల్ ద్వారానే స్పష్టమవుతుంది. డబ్బు పోవడం లెక్క కాదు, స్నేహం పోకూడదని ఛార్మి అనుకున్నట్లుంది ఈ తతంగం అంతా చూస్తుంటే.

Similar News