చరణ్ నెక్స్ట్ అతనితో సినిమా చేస్తాడు

Update: 2018-06-10 11:54 GMT

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరో గా తెరకెక్కిన చిత్రం 'తేజ్ ఐ లవ్ యూ'. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి మెగా స్టార్ చిరంజీవి ముఖ్య అథితిగా వెళ్లారు. ఆ సందర్భంగా ఆయన తన పాత రోజులు గుర్తు చేసుకుంటూ ఇలా మాట్లాడారు. క్రియేటివ్ కమర్షియల్స్ కేఎస్ రామారావు గారి కోసమే నేను ఇక్కడకి వచ్చాను కానీ తేజు గురించి కాదు అని ఆయన అన్నారు.

ఆయనతో చిరంజీవి కి అనుబంధం గుర్తు పెట్టుకుని, కెఎస్ రామారావు గురించి తన కొడుకు రామ్ చరణ్ తనంతట తాను ప్రస్తావించి, ఓ సినిమా చేస్తానని చెప్పాడని చిరు ప్రకటించారు. రాజమౌళి సినిమా తర్వాత చరణ్.. కెఎస్ రామారావు గారితో ఓ సినిమా చేస్తాడని స్పష్టం చేశారు. చరణ్ తో మాట్లాడాకే నేను ఇక్కడ ప్రకటన చేస్తున్న అని చిరంజీవి తెలిపారు.

అంతేకాకుండా నిన్న చిరంజీవి.. పవన్ కళ్యాణ్ - కరుణాకరన్ డైరెక్షన్ లో వచ్చిన 'తొలిప్రేమ' సినిమా గురించి ప్రస్తావిస్తూ... నా తమ్ముడు అంటూ ఆ సినిమా ముచ్చట్లు, వైట్ అండ్ వైట్ లో పవన్ గెటప్ ను చిరంజీవి గుర్తు చేసుకున్నారు. మా ఫామిలీలో ఎవరైనా తప్పు చేస్తే ముందుగా నేనే మందలిస్తానని కానీ.. తేజు ఇప్పటివరకు నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు.. ఇకపై ఇవ్వడు కూడా అని చిరంజీవి తెలిపారు

Similar News