చరణ్ అలా.. ఎన్టీఆర్ ఇలా..!!

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR హీరోలు లాక్ డౌన్ లో ఇంట్లోనే ఫ్యామిలితోను, జిమ్ లో వర్కౌట్స్ తో కుస్తీలు పడుతున్నారు. లాక్ డౌన్ మొదలైన కొన్ని [more]

Update: 2020-07-14 09:51 GMT

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR హీరోలు లాక్ డౌన్ లో ఇంట్లోనే ఫ్యామిలితోను, జిమ్ లో వర్కౌట్స్ తో కుస్తీలు పడుతున్నారు. లాక్ డౌన్ మొదలైన కొన్ని రోజులకే రామ్ చరణ్ RRR స్పెషల్ వీడియో తో మెగా అభిమానులను, ఇండియా వైడ్ ప్రేక్షకులను మెప్పించగా.. ఎన్టీఆర్ మాత్రమ్స్ సైలెంట్ గానే ఉన్నాడు. ఎన్టీఆర్ పుట్టిన రోజుకి కూడా రాజమౌళి RRR స్పెషల్ వీడియో ని విడుదల చెయ్యలేకపోయాడు. ఇక ఎన్టీఆర్ కూడా లాక్ డౌన్ లో ఎవరి ముందుకు రాకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. కానీ రామ్ చరణ్ మొన్న జానీ మాస్టర్ పుట్టిన రోజుకి, నిన్న వరౌట్స్ ఫొటోస్ తోనూ అభిమానులను సర్ ప్రైజ్ చేసాడు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఈ మూడు నెలలుగా కనిపించకుండా సైలెంట్ అయ్యాడు.

అయితే తాజాగా ఎన్టీఆర్ కూడా అభిమానులకు దర్శనమియ్యబోతున్నాడు. నిన్నటివరకు ఎన్టీఆర్ RRR, త్రివిక్రమ్ మూవీ, తర్వాత ప్రశాంత్ నీల్ సినిమాల విషయాలతో ఎన్టీఆర్ ఎప్పుడు న్యూస్ లో ఉన్నప్పటికీ…. ఇప్పుడు వీడియో తో అభిమానులు ముందుకు వచ్చాడు. ఈనెల 17 న ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడట. అది కూడావిజయవాడ వాస్తవ్యులకి. ఎలా అంటే.. ఎన్టీఆర్ సినిమాల్తో పాటు పలు బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. అందులో భాగంగా సెలెక్ట్ అనే మొబైల్ ఫోన్స్ అమ్మకాలు చేసే కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు ఎన్టీఆర్. ఈ నెల 17న సెలెక్ట్ మొబైల్‌కు సంబంధించిన కొత్త యాడ్ ప్రసారం కానుంది. అలాగే ఎన్టీఆర్ ఓ వీడియో పోస్ట్ చేసాడు. అందులో జూలై 17న ఈ కంపెనీకి సంబంధించి విజయవాడలో ఒక అద్భుతం ఆవిష్కృతం కాబోతోందని ఈ యాడ్‌లో ఎన్టీఆర్ వెల్లడించారు. మరి RRR తో ఎన్టీఆర్ సర్ ప్రైజ్ చేస్తాడనుకుంటే.. ఇలా ఎన్టీఆర్ యాడ్ తో అభిమనులను సర్ ప్రైజ్ చెయ్యబోతున్నాడన్నమాట. 

Tags:    

Similar News