చందూ మొదటికే వచ్చాడుగా..!

ఎక్కడైతే మొదలు పెట్టాడో అక్కడికే వచ్చాడు అంటే ఇదేనేమో. కార్తికేయ సినిమాతో హిట్ అందుకున్న చందు మొండేటి తరువాత మంచి అవకాశాలే వచ్చాయి. ఆ సినిమా హిట్ [more]

Update: 2019-03-08 08:13 GMT

ఎక్కడైతే మొదలు పెట్టాడో అక్కడికే వచ్చాడు అంటే ఇదేనేమో. కార్తికేయ సినిమాతో హిట్ అందుకున్న చందు మొండేటి తరువాత మంచి అవకాశాలే వచ్చాయి. ఆ సినిమా హిట్ అవ్వడంతో చాలామంది నిర్మాతలు అడ్వాన్స్ లు ఇచ్చేసారు. కొంతమంది హీరోలు ఆఫర్ చేశారు. ఆలా చేసిందే ‘సవ్యసాచి’ సినిమా. నాగ చైతన్య హీరోగా తీసిన ఈ సినిమా గత ఏడాది నవంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫిస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఈ సినిమా ప్లాప్ అవ్వడం వల్ల చందూకి వరుస ఆఫర్స్ చేయజారాయి. అందులో ముఖ్యంగా నాగార్జున ప్రాజెక్ట్.

మళ్లీ నిఖిల్ తోనే…

నాగ్ తో ఎప్పుటి నుండో ఓ సినిమా చేద్దాం అనుకున్న చందూకు నాగ్ షాక్ ఇచ్చాడట. అలానే ‘శర్వానంద్’తో చేద్దాం అనుకుంటే తను మాత్రం, కనీసం కథ కూడా వినకుండానే ప్రస్తుతం తన డేట్లు ఖాళీ లేవు అని చెప్పేశాడట. కాబట్టి ఇంకా చేసేది ఏమీ లేక చందూ ఇప్పుడు తన మొదటి హీరో నిఖిల్ తో చేయడానికి సిద్ధం అయ్యాడు. చందూ ఎక్కడైతే కెరీర్ స్టార్ట్ చేసాడో అక్కడికే వెళ్లాడు. చూద్దాం ఈ సినిమాతో చందూ మళ్లీ తిరిగి ఫామ్ లోకి వచ్చాడు.

Tags:    

Similar News