మొదటికే వచ్చిన చందు మొండేటి..!

‘కార్తికేయ’లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెలుగుతెరకు పరిచయం అయిన డైరెక్టర్ చందు మొండేటి రీసెంట్ గా నాగ చైతన్యతో ‘సవ్యసాచి’ అనే సినిమా తీసి బాక్సాఫిస్ వద్ద [more]

Update: 2019-04-19 11:35 GMT

‘కార్తికేయ’లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెలుగుతెరకు పరిచయం అయిన డైరెక్టర్ చందు మొండేటి రీసెంట్ గా నాగ చైతన్యతో ‘సవ్యసాచి’ అనే సినిమా తీసి బాక్సాఫిస్ వద్ద అపజయాన్ని మూట‌గ‌ట్టుకున్నాడు. అంతకుముందు చైతుతో చందు ప్రేమమ్ రీమేక్ చేయడంతో ‘సవ్యసాచి’ సినిమా చేసే ఛాన్స్ ఇచ్చాడు చైతు. ఆ టైంలోనే నాగార్జున కూడా పిలిచి ఒక ఛాన్స్ ఇచ్చాడు.

కార్తికేయ సీక్వెల్ తో

కానీ ‘సవ్యసాచి’ ఫ్లాప్ అవ్వడంతో చందు మొండేటి నాగార్జునతో అనుకున్న ప్రాజెక్ట్ ఆగిపోయింది. అలానే శర్వానంద్‌తోనూ అప్పట్లో ఓ సినిమా చేద్దామనుకున్నారు కానీ ఇప్పుడు అది కూడా ఆగిపోయింది. ఇక చేసేది ఏమీ లేక తన మొదటి సినిమా ఛాన్స్ ఇచ్చిన నిఖిల్ తోనే ‘కార్తికేయ 2’ చేయబోతున్నాడు చందూ. ఇందులో కూడా కలర్స్ స్వాతి హీరోయిన్. ఈమె కాకుండా మరో హీరోయిన్ కూడా ఉంటుందట. త్వరలోనే ఆ డీటెయిల్స్ తెలియనున్నాయి.

Tags:    

Similar News