చైతు - సామ్ లేకుండానే మొదలు పెట్టారు..!

Update: 2018-09-29 07:28 GMT

సమంత - చైతు త్వరలోనే ఆన్ స్క్రీన్ మీద రొమాన్స్ చేయనున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో ‘మజిలీ’ అనే సినిమా రూపొందబోతుంది. 'నిన్ను కోరి' ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయింది. అదేంటి చైతు - సామ్ హాలిడేలో ఉన్నారు కాదా వాళ్లు లేకుండా రెగ్యులర్ షూటింగ్ ఎలా స్టార్ట్ అయింది అనుకుంటున్నారా? వీరి అవసరం లేనటువంటి సన్నివేశాలను షూట్ చేస్తున్నాడట శివ. ప్రస్తుతం వీరు స్పెయిన్ లో ఉన్నారు. మరో ఐదు రోజుల్లో తిరిగి హైదరాబాద్ కి రానున్నారు. ఈ లోపు లీడ్ పెయిర్ లేనటువంటి సన్నివేశాలు చకచకా తీసేస్తున్నారు. వీరు తిరిగి వచ్చాక రెగ్యులర్ షూట్ లో పాల్గొననున్నారు. ఈ సినిమాను ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాని నిర్మించిన షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు.

దంపతుల కథతో...

'నిన్ను కోరి' లాంటి ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ ను అందించిన శివ నిర్వాణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తన్నాడు. పెళ్లి తరవాత భార్యాభర్తల మధ్య ఎటువంటి మనస్పర్థలు వచ్చాయని కథాంశంతో ఈ సినిమా రూపొందుతుంది . ఈ సినిమాకు ‘మజిలీ’ టైటిల్ ఖరారు చేసినట్టు సమాచారం. గోపి సుందర్ మ్యూజిక్ అందించనున్నాడు. మిగతా నటీనటులు, టెక్నిషియన్స్ పేర్లు త్వరలోనే తెలియనున్నాయి.

Similar News