మహేష్ కోసం ఏదైనా చెయ్యాలి!!

మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ తర్వాత అందరిని కన్ఫ్యూజ్ చేసి చేసి చివరికి పరశురామ్ దగ్గర ఆగాడు. పరశురామ్ కెరీర్ లో కేవలం గీత గోవిందం బ్లాక్ [more]

Update: 2020-06-02 11:03 GMT

మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ తర్వాత అందరిని కన్ఫ్యూజ్ చేసి చేసి చివరికి పరశురామ్ దగ్గర ఆగాడు. పరశురామ్ కెరీర్ లో కేవలం గీత గోవిందం బ్లాక్ బస్టర్ తప్ప చెప్పుకోదగిన సినిమాలేవీ లేకపోయినా పరశురాం చెప్పిన కథకి కనెక్ట్ అయిన మహేష్ అతనికి తొందరగా గ్రీన్ సిల్ ఏం ఇవ్వలేదు. తిప్పుకుని తిప్పుకుని తిప్పుకున్నాకే పరశురామ్ కథని సెట్ చేసాడు. పరశురామ్ కూడా మొదటిసారి స్టార్ హీరో అనేసరికి చాలా జాగ్రత్తగా కథని లాక్ చేసుకుని మహేష్ కి వినిపించి ఒకే చేసాడు. అయితే ముందు అమెరికా నేపథ్యంలో ఉన్న కథ కాస్త కరోనా లాక్ డౌన్ తో ఇండియా కి మారింది.

అయితే పరశురామ్ సర్కారు వారి పాట సినిమాలో మహేష్ కోసం కాసినో సెట్ వేసే ఆలోచనలో ఉన్నాడట. మాములుగా అయితే అమెరికా అయినా, లేదా గోవా ఆలో అయినా ఈ కాసినో ఉంటుంది. కానీ ఇప్పుడు అమెరికా వెళ్లే పరిస్థితి లేదు. మరి గోవా కి కూడా అప్పుడే అనుమతి వస్తుంది అంటే నమ్మలేం. కానీ కథకి సంబందించిన కీలక రొమాంటిక్ సన్నివేశాలు చాల ఈ కాసినో సెట్ లో ఉంటాయట. విలన్ కూతురు హీరోయిన్ కి కాసినో అంటే పిచ్చి. పిచ్చి అంటే మాములు పిచ్చి కాదు. పిచ్చి పిచ్చిగా జూదం ఆడుతూ డబ్బు తగలేస్తుందట. అందుకే ఈ సినిమాలో కీలకమైన కాసినో కోసం హైదరాబాద్ లోనే సెట్ వేస్తె బావుంటుంది అని అనుకుంటున్నారట. మరి గోవాలో అనుమతి ఇస్తే ఓకె.. లేదంటే ఆ సెట్ కి ఎంత బడ్జెట్ పెట్టాలి. ఎక్కడ ఆ సెట్ వెయ్యాలని ఆలోచిస్తారట టీం. 

Tags:    

Similar News