మహేష్ ఫాన్స్ పై కేసు?

ఈమధ్యన హీరోల ఫాన్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ రచ్చ చేస్తున్నారు. తమ హీరోలను ఎమన్నా అన్నారా వాళ్ళ పని పట్టడమే టార్గెట్ గా పెట్టుకున్నారు. మొన్నామధ్యన [more]

Update: 2020-07-02 06:13 GMT

ఈమధ్యన హీరోల ఫాన్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ రచ్చ చేస్తున్నారు. తమ హీరోలను ఎమన్నా అన్నారా వాళ్ళ పని పట్టడమే టార్గెట్ గా పెట్టుకున్నారు. మొన్నామధ్యన ఎన్టీఆర్ గురించి నటి మీరా చోప్రా ఎదో అన్నదని .. ఆమెని వెంటాడి వేటాడారు. తాజాగా టాలీవుడ్ దర్శకుడు మహేష్ ఫాన్స్ కి అడ్డంగా బుక్ అయ్యాడు. మలయాళ సినిమా విషయంలో తన అభిప్రాయాన్ని పంచుకునేందుకు తరుణ్ భాస్కర్ ని మహేష్ ఫాన్స్ వెంటాడుతున్నారు. మలయాళం లో కప్పెల చూసిన తరుణ్ భాస్కర్… హీరో పిచ్చోడిలా గట్టిగా రీసౌండ్ చేసుకుంటూ అరవడని.. అందరి కంటే స్మార్ట్‌గా ప్రతి డైలాగ్‌లో సామెత చెప్పడు. హీరోయిజం చూపిస్తూ సినిమా చివరిలో రైతులకు ఫెవర్ గాను, సైనికులకు ఫెవర్ గాను మాట్లాడరు. ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి హీరోల ఎంట్రీ ఉండదు. అదే మన ఊర్లో సినిమా అంటారంటూ వెటకారంగా మాట్లాడడంతో.. అదిగో మా మహేష్ ని ఇలా అంటావా అంటూ మహేష్ ఫాన్స్ తరుణ్  భాస్కర్ పై రాళ్ళూ రువ్వుతున్నారు. మహేష్ బాబు భరత్ అనే నేను లో రైతుల కోసము, సరిలేరు నీకెవ్వరులో సైనికుల కోసం సినిమా చిఎవరిలో మాట్లాడాడు.

అందుకే మహేష్ ఫాన్స్ తరుణ్ భాస్కర్ మా హీరోని గురించి ఇలా మాట్లాడతారా ఆంటూ సోషల్ మీడియాలో తరుణ్ భాస్కర్ ని ఆడుకుంటున్నారు.  అయితే తాజాగా తరుణ్ మహేష్ ఫాన్స్ కి వార్నింగ్ ఇచ్చాడు, వాళ్ళకి ధీటుగానే సమాధానం చెప్పాడు. వాళ్ళ ట్రోల్స్ కి గట్టిగానే సమాధానం చెప్పాడు. అయినా ట్రోల్స్ ఆగలేదు. అందుకే చివరకి తరుణ్ పోలీసులను ఆశ్రయించాడు. మహేష్ ఫ్యాన్స్ అని మెన్షన్ చెయ్యకుండా సోషల్ మీడియా వేదికగా తనను ట్రోల్ చేయడమే కాక తనని మానసికంగానూ వెంటాడుతున్నారని, బెదిరింపులకు పాల్పడ్డారని పోలీస్ లకు తరుణ్ భాస్కర్ ఫిర్యాదు చేసాడు. అంతేకాకుండా తనని వేధించిన వారి ఫోన్ నెంబర్లు దగ్గరనుండి వారి వివరాలు కూడా తరుణ్ భస్కర్ పోలీస్ లకు సమర్పించారని తెలుస్తుంది. 

Tags:    

Similar News