ఎన్టీఆర్ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తాడా?

ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి RRR లో రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా మూవీ గా క్రేజీగా తెరకెక్కుతుంది. అయితే ఈ [more]

Update: 2020-06-01 05:53 GMT

ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి RRR లో రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా మూవీ గా క్రేజీగా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమా అయిన వెంటనే ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో కమిట్ అవడం సినిమా పై ప్రకటన ఇప్పించడం జరిగిపోయాయి. RRR తో రెండేళ్లు వృధా చేసిన ఎన్టీఆర్ RRR షూటింగ్ అయ్యిందే తడవుగా త్రివిక్రమ్ సినిమాతో బిజీ అయ్యేలా ప్లాన్ చేసాడు. ఇక త్రివిక్రమ్ కూడా స్క్రిప్ట్ ని పక్కాగా ప్రిపేర్ చేస్తున్నాడు.. అంటే రాజమౌళి సినిమా తర్వాత ఏ హీరోకి హిట్ రాదనే సెంటిమెంట్ ని బ్రేక్ చేసేలా త్రివిక్రమ్ ఈ సినిమా ని తెరకెక్కించడానికి పక్కా ప్లానింగ్ లో ఉన్నాడట.

మరోపక్క ఈ సినిమాపై క్రేజీ అప్ డేట్ అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో ప్రచారంల్లోకొచ్చింది. అదేమిటంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు పాత్రలు అంటే ద్విపాత్రాభినయం చేయబోతున్నాడట. మరి ఎన్టీఆర్ కి ద్విపాత్రాభినయం అచ్చిరాదు. గతంలో తండ్రి కొడుకులుగా నటించిన ఆంధ్రావాలా ఘోరమైన డిజాస్టర్ అయ్యింది. అయితే జై లవ కుశ లో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసి హిట్ కొట్టాడు. మరి ఈ సినిమాలో ఎన్టీఆర్ డబుల్ రోల్ లో కనిపిస్తాడా? లేదంటే ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో విభిన్నమైన షేడ్స్ లో కనిపిస్తాడా అనేది మాత్రం సస్పెన్స్ అంటున్నారు. మరోపక్క ఈ ద్విపాత్రాభినయం సెంటిమెంట్ ని ఎన్టీఆర్ బ్రేక్ చేస్తాడా? అనే అనుమానంలోనూ ఎన్టీఆర్ ఫాన్స్ ఉన్నారు. 

Tags:    

Similar News